రాష్ట్రంలోనే తొలిసారిగా బోయిన్పల్లి మార్కెట్లో వ్యాక్సినేషన్(vaccination) కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి.ఎన్ శ్రీనివాస్ తెలిపారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని కంటోన్మెంట్ సీఈవో అజిత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే మార్కెట్లో పనిచేసే హమాలీలు, రైతులు, దుకాణాదారులకు టీకా ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.
మార్కెట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అందరూ విధిగా మాస్క్ ధరించాలని... లాక్డౌన్కు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: TS Lockdown: రేపు కేబినెట్ భేటీ.. లాక్డౌన్పై కీలక నిర్ణయం