ETV Bharat / state

'తెలుగు రాష్ట్రాల సీఎంలు.. నిర్ణయాలపై పునరాలోచించాలి'

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఏపీలో ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్​ను తొలగించడం... లాక్​డౌన్​ వల్ల ఆదాయం పెరుగుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టడం సరైంది కాదని మండిపడ్డారు.

author img

By

Published : May 29, 2020, 8:14 PM IST

v hanumanthao press meet
'తెలుగు రాష్ట్రాల సీఎంలు.. నిర్ణయాలపై పునరాలోచించాలి'

ఆంధ్రప్రదేశ్​లో ఎలక్షన్​ కమిషనర్​గా కొనసాగుతున్న నిమ్మగడ్డ రమేష్​ను పదవి కాలంలో ఉండగానే తొలగించడమనేది ప్రజాస్వామికంగా సరైందికాదని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. వైకాపాకి చెందిన కొంతమంది నాయకులు జ్యుడిషియరీపైన కామెంట్లు చేస్తూ ఆ పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారన్నారు.

లాక్​డౌన్​ సడలింపులతో తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టడాన్ని వీహెచ్​ ఖండించారు. పోతిరెడ్డిపాడు నుంచి 800 క్యూసెక్కుల నీటిని ఏపీకి తరలించుకుపోతే దక్షిణ తెలంగాణ ఎడారైపోతుందనే విషయాన్ని సీఎం కేసీఆర్​ గుర్తుంచుకోవాలన్నారు.

ఆంధ్రప్రదేశ్​లో ఎలక్షన్​ కమిషనర్​గా కొనసాగుతున్న నిమ్మగడ్డ రమేష్​ను పదవి కాలంలో ఉండగానే తొలగించడమనేది ప్రజాస్వామికంగా సరైందికాదని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. వైకాపాకి చెందిన కొంతమంది నాయకులు జ్యుడిషియరీపైన కామెంట్లు చేస్తూ ఆ పార్టీకి చెడ్డ పేరు తీసుకువస్తున్నారన్నారు.

లాక్​డౌన్​ సడలింపులతో తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టడాన్ని వీహెచ్​ ఖండించారు. పోతిరెడ్డిపాడు నుంచి 800 క్యూసెక్కుల నీటిని ఏపీకి తరలించుకుపోతే దక్షిణ తెలంగాణ ఎడారైపోతుందనే విషయాన్ని సీఎం కేసీఆర్​ గుర్తుంచుకోవాలన్నారు.

ఇవీ చూడండి : మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.