గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలోని డాక్టర్స్ పార్కింగ్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గుర్తించిన సెక్యూరిటీ గార్డు.. ఆసుపత్రి అవుట్ పోస్టు సిబ్బందికి సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
మృతునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతునికి సంబంధించి వారు ఎవరైనా ఉంటే చిలకలగూడ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.
ఇదీ చూడండి: ఫోను పక్కనుంటే.. పలకరింపే కరువాయే!