ETV Bharat / state

'కొత్త సంస్కరణలతో బ్యాంకుల ప్రాధాన్యం పెరిగింది' - హిమాయత్​నగర్​లో ఇండియన్​ బ్యాంక్​ బ్రాంచ్​

దేశంలో అనేక సంస్కరణలతో బ్యాంకుల ప్రాధాన్యత పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హిమాయత్​నగర్​లో ఇండియన్ బ్యాంక్ నూతన శాఖను ఆయన ప్రారంభించారు.

ఇండియన్​ బ్యాంక్​ నూతన శాఖను ప్రారంభించిన కిషన్​ రెడ్డి
ఇండియన్​ బ్యాంక్​ నూతన శాఖను ప్రారంభించిన కిషన్​ రెడ్డి
author img

By

Published : Jan 26, 2021, 7:51 PM IST

హైదరాబాద్​ హిమాయత్​నగర్​లో ఏర్పాటు చేసిన ఇండియన్​ బ్యాంక్​ నూతన శాఖను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ప్రారంభించారు. ప్రజలందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జన్​ధన్​ ఖాతాలు ప్రారంభించిందని మంత్రి తెలిపారు.

ఖాతాదారులకు మరింత భద్రతగా సేవలందించేందుకు కొన్ని బ్యాంకులను విలీనం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు కిషన్​ రెడ్డి వెల్లడించారు. వీటి వల్ల బ్యాంకింగ్​ మోసాలు తగ్గుతాయని పేర్కొన్నారు.

హైదరాబాద్​ హిమాయత్​నగర్​లో ఏర్పాటు చేసిన ఇండియన్​ బ్యాంక్​ నూతన శాఖను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ప్రారంభించారు. ప్రజలందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జన్​ధన్​ ఖాతాలు ప్రారంభించిందని మంత్రి తెలిపారు.

ఖాతాదారులకు మరింత భద్రతగా సేవలందించేందుకు కొన్ని బ్యాంకులను విలీనం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు కిషన్​ రెడ్డి వెల్లడించారు. వీటి వల్ల బ్యాంకింగ్​ మోసాలు తగ్గుతాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. త్రివర్ణ పతాకం రెపరెపలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.