ETV Bharat / state

సీఎం కేసీఆర్​ను కలిసిన కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి

author img

By

Published : Apr 3, 2021, 7:50 PM IST

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్​సింగ్ ఖరోలా ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన 6 ఎయిర్​ స్ట్రిప్‌ల సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదీప్​ సింగ్​ను కోరారు.

pradeep singh kharola met CM KCR
pradeep singh kharola met CM KCR
సీఎం కేసీఆర్​ను కలిసిన కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన 6 ఎయిర్​ స్ట్రిప్‌ల సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్​సింగ్ ఖరోలా ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్​నగర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో, నిజామాబాద్ జిల్లా జక్రాన్​పల్లి, మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో కొత్తగా ఎయిర్​స్ట్రిప్​లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 6 ఎయిర్​స్ట్రిప్​ల కోసం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో వాటి సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎయిర్​స్ట్రిప్​ల మంజూరు కోసం కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా సీఎం కేసీఆర్​కు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

సీఎం కేసీఆర్​ను కలిసిన కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన 6 ఎయిర్​ స్ట్రిప్‌ల సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్​సింగ్ ఖరోలా ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్​నగర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో, నిజామాబాద్ జిల్లా జక్రాన్​పల్లి, మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రలో కొత్తగా ఎయిర్​స్ట్రిప్​లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 6 ఎయిర్​స్ట్రిప్​ల కోసం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో వాటి సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎయిర్​స్ట్రిప్​ల మంజూరు కోసం కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా సీఎం కేసీఆర్​కు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.