సైబరాబాద్ పోలీసులు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో నిర్బంధ తనిఖీలు చేశారు. స్థానికంగా ఉన్న నివాసితులు, ఆధార్ కార్డులను పరిశీలించారు. 28 మంది అనుమానితులను, సరైన పత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు సమక్షంలో నిర్వహించిన ఈ సోదాలలో అడిషనల్ డీసీపీ, ఏసీపీ, 11 సీఐలు, 200 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల్లో అభద్రతా భావం తొలగించి పోలీసులపై నమ్మకాన్నిపెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు.
ఇదీ చూడండి : త్వరలో "తెలంగాణ బచావో".. కాంగ్రెస్ ర్యాలీ