ETV Bharat / state

TSRTC: అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు టీఎస్‌ఆర్‌టీసీ గ్రీన్ సిగ్నల్

author img

By

Published : Jun 20, 2021, 5:11 PM IST

Updated : Jun 20, 2021, 7:10 PM IST

rtc
అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించిన టీఎస్‌ఆర్‌టీసీ

17:06 June 20

అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం

    అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేతతో అంతరాష్ట్ర సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రద్దీ రూట్లలో బస్సు సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది.  

కర్ణాటకకు బస్సు సర్వీసులు  

   కర్ణాటక నిబంధనలకు అనుగుణంగా రేపట్నుంచి టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి. ఉదయం 5 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకకు సర్వీసులు తిరిగేలా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మినహా కర్ణాటకలో అన్ని ప్రాంతాలకు తెలంగాణ బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. కర్ణాటకలో వారాంత కర్ఫ్యూ దృష్ట్యా శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు టీఎస్​ఆర్టీసీ ప్రకటించింది.  

ఏపీ నుంచి రాష్ట్రానికి బస్సులు  

   రేపట్నుంచి తెలంగాణకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ కూడా నిర్ణయం తీసుకుంది. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బస్సులు నడవనున్నాయి. విజయవాడ సహా పలు ప్రాంతాల నుంచి రాష్ట్రానికి బస్సులు రానున్నాయి. ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయాన్ని కూడా ఏపీఎస్​ఆర్టీసీ కల్పించింది.

మహారాష్ట్రకు మంగళవారం నుంచి.. 

    మహారాష్ట్రలోని గమ్యస్థానాలకు అక్కడి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడిపిస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్రకు మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు కొనసాగించాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.  

ఇదీ చదవండి: Cm Kcr Fun: సీఎం కేసీఆర్​నే మాస్క్ తీయమన్నాడంటా!

17:06 June 20

అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం

    అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేతతో అంతరాష్ట్ర సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రేపట్నుంచి ఏపీకి బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రద్దీ రూట్లలో బస్సు సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తోంది.  

కర్ణాటకకు బస్సు సర్వీసులు  

   కర్ణాటక నిబంధనలకు అనుగుణంగా రేపట్నుంచి టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి. ఉదయం 5 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకకు సర్వీసులు తిరిగేలా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మినహా కర్ణాటకలో అన్ని ప్రాంతాలకు తెలంగాణ బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. కర్ణాటకలో వారాంత కర్ఫ్యూ దృష్ట్యా శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు టీఎస్​ఆర్టీసీ ప్రకటించింది.  

ఏపీ నుంచి రాష్ట్రానికి బస్సులు  

   రేపట్నుంచి తెలంగాణకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ కూడా నిర్ణయం తీసుకుంది. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బస్సులు నడవనున్నాయి. విజయవాడ సహా పలు ప్రాంతాల నుంచి రాష్ట్రానికి బస్సులు రానున్నాయి. ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయాన్ని కూడా ఏపీఎస్​ఆర్టీసీ కల్పించింది.

మహారాష్ట్రకు మంగళవారం నుంచి.. 

    మహారాష్ట్రలోని గమ్యస్థానాలకు అక్కడి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడిపిస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్రకు మంగళవారం నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు కొనసాగించాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.  

ఇదీ చదవండి: Cm Kcr Fun: సీఎం కేసీఆర్​నే మాస్క్ తీయమన్నాడంటా!

Last Updated : Jun 20, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.