ETV Bharat / state

ఎరుపుతో గులాబి జత.. భవిష్యత్తులోనూ కమ్యూనిష్టులతో తెరాస పొత్తు

TRS with CPM,CPI: మునుగోడు ఉపఎన్నికలో కలిసి పనిచేసినా... తెరాస, సీపీఐ, సీపీఎంలు భవిష్యత్‌లోనూ ఐక్యంగా సాగాలని నిర్ణయించాయి. భాజపా వ్యతిరేక పోరాటమే అజెండాగా ఉమ్మడి కార్యాచరణ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీపీఎం-సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు వెళ్లిన మంత్రిజగదీశ్‌రెడ్డి, పల్లా సహా ఇతర తెరాస నేతలు వివిధ అంశాలపై చర్చించారు. ఈ నెల 12న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని పర్యటనను పురస్కరించుకొని నిరసనలు తెలపనున్నట్లు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం తెలిపారు.

author img

By

Published : Nov 8, 2022, 7:59 PM IST

TRS with CPM and CPI
భవిష్యత్తులోనూ కమ్యూనిష్టులతో తెరాస పొత్తు

TRS with CPM,CPI మునుగోడు ఉపఎన్నికలో కలిసి పనిచేసిన తెరాస- సీపీఐ, సీపీఎంలు ఉమ్మడి కార్యాచరణపై దృష్టిపెట్టాయి. ఈ మేరకు సీపీఐ రాష్ట్రకార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గసభ్యులు చాడ వెంకట్‌రెడ్డితో భేటీ అయిన ఎంఎల్‌సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్ వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కేంద్రంపై పోరాడేందుకు ఇరుపార్టీలు ఉమ్మడి కార్యాచరణ ద్వారా ముందుకు వెళ్లాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నెల 12న రాష్ట్రానికి ప్రధాని రాక దృష్ట్యా.... చేపట్టే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అనంతరం... ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్‌తో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన మంత్రి జగదీశ్‌రెడ్డి... ఆ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. భాజపాకు వ్యతిరేకంగా భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించున్నట్లు జగదీశ్‌రెడ్డి తెలిపారు. మునుగోడు గెలుపుతో తెలంగాణాను పెద్ద విపత్తు నుంచి కాపాడామని కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.

'మునుగోడులో కమ్యూనిస్టు శ్రేణుల ప్రచారం వల్లనే తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తెరాస విజయానికి సహకరించిన సీపీఎం, సీపీఐ నేతలకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. దేశంలో భాజపాకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం.' -జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి

'రాష్ట్రాన్ని పెద్ద విపత్తు నుంచి కాపాడమని సంతోషంగా ఉంది. ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని భాజపా భావిస్తోంది. భాజపాకు అసలు తెలంగాణలో బలం లేదు.' - కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

అక్కడి నుంచి సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన మంత్రి జగదీశ్‌రెడ్జి...ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. భాజపా ముక్త్‌ భారత్‌కు మునుగోడులో పునాది పడిందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. మునుగోడు ఎన్నిక ద్వారా తెలంగాణలో కాషాయ రాజకీయాలకు కుట్ర జరిగిందని.... భాజపా ఓటమి ద్వారా దీనిని తిప్పికొట్టామని తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు.

మునుగోడు ఉపఎన్నిక భాజపా చేసిన కుట్ర. దేశంలో, రాష్ట్రంలో భాజపాని తిరగనీయకూడదనేది మా సిద్ధాంతం. దుర్మార్గమైన గవర్నర్ వ్యవస్థను తొలగించాలి. ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని ఇప్పుడు ప్రారంభించడమేంటి?- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

రాష్ట్రంలో ప్రధాని పర్యటనతో పాటు... పాలనలో గవర్నర్‌ జోక్యంపైనా పోరాటాలు చేయాలని కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందన్న నేతలు... ఇందుకు వ్యతిరేకంగా ఈ నెల 10 నుంచి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

భవిష్యత్తులోనూ కమ్యూనిష్టులతో తెరాస పొత్తు

ఇవీ చూడండి:

TRS with CPM,CPI మునుగోడు ఉపఎన్నికలో కలిసి పనిచేసిన తెరాస- సీపీఐ, సీపీఎంలు ఉమ్మడి కార్యాచరణపై దృష్టిపెట్టాయి. ఈ మేరకు సీపీఐ రాష్ట్రకార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గసభ్యులు చాడ వెంకట్‌రెడ్డితో భేటీ అయిన ఎంఎల్‌సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్ వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కేంద్రంపై పోరాడేందుకు ఇరుపార్టీలు ఉమ్మడి కార్యాచరణ ద్వారా ముందుకు వెళ్లాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నెల 12న రాష్ట్రానికి ప్రధాని రాక దృష్ట్యా.... చేపట్టే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అనంతరం... ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్‌తో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన మంత్రి జగదీశ్‌రెడ్డి... ఆ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. భాజపాకు వ్యతిరేకంగా భవిష్యత్‌లోనూ ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించున్నట్లు జగదీశ్‌రెడ్డి తెలిపారు. మునుగోడు గెలుపుతో తెలంగాణాను పెద్ద విపత్తు నుంచి కాపాడామని కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.

'మునుగోడులో కమ్యూనిస్టు శ్రేణుల ప్రచారం వల్లనే తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తెరాస విజయానికి సహకరించిన సీపీఎం, సీపీఐ నేతలకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. దేశంలో భాజపాకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం.' -జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి

'రాష్ట్రాన్ని పెద్ద విపత్తు నుంచి కాపాడమని సంతోషంగా ఉంది. ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని భాజపా భావిస్తోంది. భాజపాకు అసలు తెలంగాణలో బలం లేదు.' - కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

అక్కడి నుంచి సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన మంత్రి జగదీశ్‌రెడ్జి...ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. భాజపా ముక్త్‌ భారత్‌కు మునుగోడులో పునాది పడిందని జగదీశ్‌రెడ్డి తెలిపారు. మునుగోడు ఎన్నిక ద్వారా తెలంగాణలో కాషాయ రాజకీయాలకు కుట్ర జరిగిందని.... భాజపా ఓటమి ద్వారా దీనిని తిప్పికొట్టామని తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు.

మునుగోడు ఉపఎన్నిక భాజపా చేసిన కుట్ర. దేశంలో, రాష్ట్రంలో భాజపాని తిరగనీయకూడదనేది మా సిద్ధాంతం. దుర్మార్గమైన గవర్నర్ వ్యవస్థను తొలగించాలి. ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని ఇప్పుడు ప్రారంభించడమేంటి?- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

రాష్ట్రంలో ప్రధాని పర్యటనతో పాటు... పాలనలో గవర్నర్‌ జోక్యంపైనా పోరాటాలు చేయాలని కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయించాయి. సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందన్న నేతలు... ఇందుకు వ్యతిరేకంగా ఈ నెల 10 నుంచి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

భవిష్యత్తులోనూ కమ్యూనిష్టులతో తెరాస పొత్తు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.