ETV Bharat / state

భాజపా ధర్నా జీహెచ్‌ఎంసీ చరిత్రలో చీకటిరోజు: తెరాస కార్పొరేటర్లు

author img

By

Published : Nov 24, 2021, 3:49 PM IST

జీహెచ్​ఎంసీ కార్యాలయాన్ని తెరాస నేతలు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. జీహెచ్​ఎంసీ పరిసరాలన్నింటిని పాలతో శుభ్రం చేశారు. భాజపా కార్పొరేటర్ల ధర్నానును ఖండించి.. వారి ధర్నా జీహెచ్​ఎంసీ చరిత్రలోనే చీకటి రోజంటూ వ్యాఖ్యానించారు.

trs-corporates
తెరాస కార్పొరేటర్ల శుద్ధి కార్యక్రమం

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో నిన్న భాజపా కార్పొరేటర్లు వ్యవహరించిన తీరును తెరాస ఖండించింది. ఈ మేరకు జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ పరిసరాలను పాలతో శుభ్రం చేస్తూ… నిరనస వ్యక్తం చేశారు.

అనంతరం భాజపా కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని మేయర్‌ విజయలక్ష్మికి వారు వినతిపత్రం అందజేశారు. ఘటనకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేసి… కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతుంటే… భాజపా నాయకులు నగర ఖ్యాతిని అప్రతిష్ఠపాలు చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమన్వయంతో సాగితేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని… అనసవర వివాదాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.

ఏం జరిగిందంటే..

మంగళవారం హైదరాబాద్‌ జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీహెచ్​ఎంసీ కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ... మేయర్‌ ఛాంబర్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. పోలీసులు వారిని ఎక్కడిక్కడ అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేయటంతో ఉద్రిక్త వాతావరణం (BJP corporators besiege GHMC headquarters) ఏర్పడింది.

ఇదీ చూడండి: జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో భాజపా మెరుపు ధర్నా, మేయర్ ఛాంబర్​లో బీభత్సం

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో నిన్న భాజపా కార్పొరేటర్లు వ్యవహరించిన తీరును తెరాస ఖండించింది. ఈ మేరకు జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ పరిసరాలను పాలతో శుభ్రం చేస్తూ… నిరనస వ్యక్తం చేశారు.

అనంతరం భాజపా కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని మేయర్‌ విజయలక్ష్మికి వారు వినతిపత్రం అందజేశారు. ఘటనకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేసి… కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చర్యలు చేపడుతుంటే… భాజపా నాయకులు నగర ఖ్యాతిని అప్రతిష్ఠపాలు చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమన్వయంతో సాగితేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని… అనసవర వివాదాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.

ఏం జరిగిందంటే..

మంగళవారం హైదరాబాద్‌ జీహెచ్​ఎంసీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీహెచ్​ఎంసీ కార్యాలయం వద్ద భాజపా కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ... మేయర్‌ ఛాంబర్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. పోలీసులు వారిని ఎక్కడిక్కడ అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేయటంతో ఉద్రిక్త వాతావరణం (BJP corporators besiege GHMC headquarters) ఏర్పడింది.

ఇదీ చూడండి: జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో భాజపా మెరుపు ధర్నా, మేయర్ ఛాంబర్​లో బీభత్సం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.