Revanth On Cm Kcr: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు ఇష్టమున్నట్లు పెంచుతున్నారని...అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రం తగ్గించలేదని దుయ్యబట్టారు. వరదల వల్ల 1400కోట్లు నష్టం జరిగిందని చెబుతున్న ప్రభుత్వం స్పష్టమైన అంచనా వేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ వారం రోజులు దిల్లీలో ఉన్నా నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. చికోటి ప్రవీణ్ వెనుక ఉన్న చీకటి మిత్రులు ఎవరనేది బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఈ విషయంలో ప్రభుత్వం జుడిషియల్ విచారణకు ఆదేశించాలన్నారు. ఎమ్మెల్యేకు సంబంధించిన స్టిక్కర్ పారేశానని బాధ్యతారాహిత్యంగా వ్యవహారించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో అసిఫాబాద్ నియోజకవర్గ ఆదివాసీ నాయకురాలు, మాజీ మంత్రి భీమ్రావ్ కూతురు ముర్సుకొల సరస్వతి కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
మునుగోడు ఎమ్మెల్యే ‘కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విషయంలో బాధ్యత అంతా ఉత్తమ్ తీసుకున్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన మునుగోడును కాపాడుకుంటాం. నల్గొండ జిల్లాలో ఉత్తమ్, కోమటిరెడ్డి వంటి బలమైన నేతలు ఉన్నారు. ఏదైనా ఉపద్రవం వస్తే కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండి కాపాడుకుంటుంది’- రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
పోడు సాగుదారులకు పట్టాలు ఎందుకు ఇవ్వటం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిలదీశారు. సీఎం కేసీఆర్, పోలీసులు ఆదివాసీలపైనే ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి తెరాస, భాజపా ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ ఎన్నోసార్లు అవమానించారు. రాష్ట్రంలో వరదలొస్తే మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. హైదరాబాద్, భద్రాచలం ముంపు బాధితుల కోసం ఏం చేశారని రేవంత్ ప్రశ్నించారు. ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి.. వారం రోజులుగా దిల్లీలో ఉన్న కేసీఆర్ నోరు మెదపలేదని విమర్శించారు. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వెనక ఉన్న చీకటి మిత్రులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని.. స్టిక్కర్ పారేశానని బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: వాళ్లు వద్దనుకుంటుంటే.. వీళ్లు మాత్రం కోరుకుంటున్నారు: బండి సంజయ్