ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ ​@ 9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jun 21, 2020, 8:59 AM IST

topten-news
టాప్​టెన్ న్యూస్​@9AM

జీవన యోగా

ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేళ.. ప్రపంచ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు . కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి పలు యోగాసనాలు ఉపయోగపడతాయన్నారు మోదీ. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

డిజిటల్​ వేదికగా..

ఆరో అంతర్జాతీయ 'యోగా డే' వేడుకలను ఆదివారం ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సారి కరోనా కారణంగా వేడుకలను డిజిటల్ ప్లాట్​ఫాంలలో నిర్వహిస్తున్నారు. ఔత్సాహికులు ఉదయం నుంచే ఆసనాలు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. అవేంటో మీరూ ఓ లుక్కేయండి.

వ్యూహాత్మకంగా

చైనా దాష్టీకంతో ఉద్రిక్తతలు తలెత్తిన లద్దాఖ్‌లోని సరిహద్దుల వద్ద భద్రతను భారత్​ కట్టుదిట్టం చేసింది. 2000 మంది ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలను సరిహద్దుల్లోకి పంపనున్నట్లు కేంద్రం హోంశాఖ అధికారవర్గాలు తెలిపాయి. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

నాన్నకు ప్రేమతో..

తల్లి ఆయువు పోస్తే... ఆ ఆయువును ఆరిపోకుండా కంటికిరెప్పల కాపాడే శక్తి పేరే నాన్న. కుటుంబ సంక్షేమం కోసం అహర్నిశలు.. నిర్విరామంగా కృషి చేసే తండ్రులకు అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాకాంక్షలు. ఫాదర్స్​డే ఎప్పుడు నుంచి చేసుకుంటున్నామో తెలుసా.

వలయాకార సూర్యగ్రహణం

గగనతలంలో అరుదైన సుందర దృశ్యమొకటి ఇవాళ కనువిందు చేయనుంది. ‘వలయాకార సూర్యగ్రహణం’ ఆవిష్కృతం కానుంది. ఈ ఖగోళ పరిణామం ఫలితంగా ఆకాశంలో 'జ్వాలా వలయం' ఏర్పడుతుంది. గ్రహణం విశేషాలు ఏమిటంటే..

తొలి వసంతం

తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌.. జాతికి అంకితం చేసి నేటికి ఏడాది అయింది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా అభివర్ణించే కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి.

కమ్ముకొస్తోంది.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైరస్​ ఉద్ధృతి ఇలా ఉంది.

ఉగ్ర వేట

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో​ ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సైనికులకు తారసపడిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

యువ ఛాంపియన్లు లాక్​డౌన్​

వరుస విజయాలతో దసుకెళ్తున్న వర్తమాన క్రీడాకారులపై లాక్​డౌన్​ తీవ్ర ప్రభావం చూపింది. ఆంక్షల వల్ల ఇంటికే పరిమితమయ్యారు యువ ఛాంపియన్లు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు?. భవిష్యత్తుపై వాళ్లేమంటున్నారో తెలుసుకుందాం.

డిజిటల్​ తెరపై వెండి తారలు

కరోనా ప్రభావంతో థియేటర్లకు ప్రేక్షకుల ఆదరణ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ సమయంలో సినీ ప్రపంచం వెబ్​సిరీస్​ల వైపు మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే మన వెండి తెర మద్దుగుమ్మలు డిజిటల్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారెవరో తెలుసుకుందామా?

జీవన యోగా

ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేళ.. ప్రపంచ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు . కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి పలు యోగాసనాలు ఉపయోగపడతాయన్నారు మోదీ. పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి.

డిజిటల్​ వేదికగా..

ఆరో అంతర్జాతీయ 'యోగా డే' వేడుకలను ఆదివారం ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సారి కరోనా కారణంగా వేడుకలను డిజిటల్ ప్లాట్​ఫాంలలో నిర్వహిస్తున్నారు. ఔత్సాహికులు ఉదయం నుంచే ఆసనాలు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. అవేంటో మీరూ ఓ లుక్కేయండి.

వ్యూహాత్మకంగా

చైనా దాష్టీకంతో ఉద్రిక్తతలు తలెత్తిన లద్దాఖ్‌లోని సరిహద్దుల వద్ద భద్రతను భారత్​ కట్టుదిట్టం చేసింది. 2000 మంది ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలను సరిహద్దుల్లోకి పంపనున్నట్లు కేంద్రం హోంశాఖ అధికారవర్గాలు తెలిపాయి. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

నాన్నకు ప్రేమతో..

తల్లి ఆయువు పోస్తే... ఆ ఆయువును ఆరిపోకుండా కంటికిరెప్పల కాపాడే శక్తి పేరే నాన్న. కుటుంబ సంక్షేమం కోసం అహర్నిశలు.. నిర్విరామంగా కృషి చేసే తండ్రులకు అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాకాంక్షలు. ఫాదర్స్​డే ఎప్పుడు నుంచి చేసుకుంటున్నామో తెలుసా.

వలయాకార సూర్యగ్రహణం

గగనతలంలో అరుదైన సుందర దృశ్యమొకటి ఇవాళ కనువిందు చేయనుంది. ‘వలయాకార సూర్యగ్రహణం’ ఆవిష్కృతం కానుంది. ఈ ఖగోళ పరిణామం ఫలితంగా ఆకాశంలో 'జ్వాలా వలయం' ఏర్పడుతుంది. గ్రహణం విశేషాలు ఏమిటంటే..

తొలి వసంతం

తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌.. జాతికి అంకితం చేసి నేటికి ఏడాది అయింది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా అభివర్ణించే కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి.

కమ్ముకొస్తోంది.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైరస్​ ఉద్ధృతి ఇలా ఉంది.

ఉగ్ర వేట

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో​ ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రత దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సైనికులకు తారసపడిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

యువ ఛాంపియన్లు లాక్​డౌన్​

వరుస విజయాలతో దసుకెళ్తున్న వర్తమాన క్రీడాకారులపై లాక్​డౌన్​ తీవ్ర ప్రభావం చూపింది. ఆంక్షల వల్ల ఇంటికే పరిమితమయ్యారు యువ ఛాంపియన్లు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు?. భవిష్యత్తుపై వాళ్లేమంటున్నారో తెలుసుకుందాం.

డిజిటల్​ తెరపై వెండి తారలు

కరోనా ప్రభావంతో థియేటర్లకు ప్రేక్షకుల ఆదరణ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ సమయంలో సినీ ప్రపంచం వెబ్​సిరీస్​ల వైపు మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే మన వెండి తెర మద్దుగుమ్మలు డిజిటల్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారెవరో తెలుసుకుందామా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.