ETV Bharat / state

మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. - hyderabad

గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు సహా విభజనాంశాలపై నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. కేసీఆర్, జగన్ భేటీకి హైదరాబాద్ ప్రగతిభవన్ వేదిక కానుంది.

కేసీఆర్​, జగన్​
author img

By

Published : Sep 22, 2019, 5:23 PM IST

Updated : Sep 23, 2019, 10:30 AM IST

మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..

హైదరాబాద్​లోని ప్రగతిభవన్​ వేదికగా నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు సహా విభజనాంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారు. ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సమావేశంలో పాల్గొంటారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు విషయమై భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. జలాల తరలింపునకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రులు చర్చించారు.

ఇంజినీర్ల కమిటీలు...

సీఎంల నిర్ణయానికి అనుగుణంగా ఇరు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీలు గతంలో ఉమ్మడిగా, విడివిడిగా చర్చించాయి. జలాల తరలింపునకు సంబంధించి వివిధ ప్రతిపాదనలను రూపొందించి పరిశీలించారు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను ఇంజినీర్లు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై నేటి సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తారు. దీంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సహా ఇతర సమస్యలపై కూడా సమావేశంలో చర్చిస్తారు.

ఇదీ చూడండి : భారత్​ గురించే 30 నిమిషాల పాటు ట్రంప్​ ప్రసంగం

మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..

హైదరాబాద్​లోని ప్రగతిభవన్​ వేదికగా నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు సహా విభజనాంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారు. ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సమావేశంలో పాల్గొంటారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు విషయమై భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. జలాల తరలింపునకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రులు చర్చించారు.

ఇంజినీర్ల కమిటీలు...

సీఎంల నిర్ణయానికి అనుగుణంగా ఇరు రాష్ట్రాల ఇంజినీర్ల కమిటీలు గతంలో ఉమ్మడిగా, విడివిడిగా చర్చించాయి. జలాల తరలింపునకు సంబంధించి వివిధ ప్రతిపాదనలను రూపొందించి పరిశీలించారు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను ఇంజినీర్లు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిపై నేటి సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తారు. దీంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సహా ఇతర సమస్యలపై కూడా సమావేశంలో చర్చిస్తారు.

ఇదీ చూడండి : భారత్​ గురించే 30 నిమిషాల పాటు ట్రంప్​ ప్రసంగం

Intro:Body:Conclusion:
Last Updated : Sep 23, 2019, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.