హైదరాబాద్ మఖ్దూం భవన్లో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, తెతెదేపా నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో మే 11వ తేదీన ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు కోదండరాం వెల్లడించారు. ఈ దీక్షకు అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు హాజరవ్వాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: మన అమ్మకు ఆదివారం సెలవిద్దాం...