ETV Bharat / state

ధనరాజ్​తో జాగ్రత్త... ఖాళీ ఇల్లు కనిపిస్తే దోచేస్తాడు! - దొంగతనాలకు పాల్పడుతున్నధన్​రాజ్​ అరెస్టు చేసిన శంషాబాద్ పోలీసులు

మూడుసార్లు జైలుకెళ్లినా తీరులో మార్పులేదు. జువైనల్ హోంలో ఎన్ని పాఠాలు చెప్పిన అతని చెవికెక్కలేదు. వ్యసనాలకు బానిసై కనపడిన ప్రతిఇంటినీ దోచేసే స్థితికి చేరాడు! చివరికి కటకటాల పాలయ్యాడు.

మూడు సార్లు జైలుకెళ్లినా మారలేదు
author img

By

Published : Oct 10, 2019, 8:29 PM IST

Updated : Oct 10, 2019, 8:50 PM IST

ధనరాజుతో జాగ్రత్త... ఖాళీ ఇల్లు కనిపిస్తే దోచేస్తాడు!
వ్యసనాలకు బానిసై వరుస దొంగతనాలకు పాల్పడున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమారు మీడియాకు వివరించారు. జీడిమెట్ల, సిద్దిపేట, మహబూబ్​నగర్​ ఏరియాల్లోని పలు ప్రాంతాల్లో చోరీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు వేట ప్రారంభించారు. అయినా చిక్కడం లేదు. శంషాబాద్​ పీఎస్ పరిధిలో పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. ప్రవర్తన సందేహంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించారు. తన పేరు ధనరాజ్ అని, వ్యసనాలకు బానిసై దొంగగా మారానని ఒప్పుకున్నాడు. శంషాబాద్​ పీఎస్ పరిధిలోని ఓ ఆలయంలో చోరీ చేసి వస్తున్నట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి ఓ ద్విచక్రవాహనం, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్​కు తరలించారు.

వ్యసనాలకు బానిసైన ధనరాజ్ బాల్యంలోనే జువైనల్ హోంకు వెళ్లివచ్చాడు. ఇప్పటికే మూడుసార్లు జైలు జీవితం గడిపాడు. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో పీడీ యాక్టు ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు ఏసీపీ అశోక్ కుమార్ వివరించారు.

ఇదీ చూడండి : 'మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవ్వండి'

ధనరాజుతో జాగ్రత్త... ఖాళీ ఇల్లు కనిపిస్తే దోచేస్తాడు!
వ్యసనాలకు బానిసై వరుస దొంగతనాలకు పాల్పడున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమారు మీడియాకు వివరించారు. జీడిమెట్ల, సిద్దిపేట, మహబూబ్​నగర్​ ఏరియాల్లోని పలు ప్రాంతాల్లో చోరీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు వేట ప్రారంభించారు. అయినా చిక్కడం లేదు. శంషాబాద్​ పీఎస్ పరిధిలో పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. ప్రవర్తన సందేహంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించారు. తన పేరు ధనరాజ్ అని, వ్యసనాలకు బానిసై దొంగగా మారానని ఒప్పుకున్నాడు. శంషాబాద్​ పీఎస్ పరిధిలోని ఓ ఆలయంలో చోరీ చేసి వస్తున్నట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి ఓ ద్విచక్రవాహనం, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్​కు తరలించారు.

వ్యసనాలకు బానిసైన ధనరాజ్ బాల్యంలోనే జువైనల్ హోంకు వెళ్లివచ్చాడు. ఇప్పటికే మూడుసార్లు జైలు జీవితం గడిపాడు. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో పీడీ యాక్టు ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు ఏసీపీ అశోక్ కుమార్ వివరించారు.

ఇదీ చూడండి : 'మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవ్వండి'

TG_HYD_36_10_SHAMSHABAD CHORI ARREST_AB౼TS10020ఎం.భుజంగారెడ్డి. 8008840002 (రాజేంద్రనగర్) note:feed from desk whatsapp. .యాంకర్... చెప్పేవారు లేక చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు బానిసైపికల దాక తాగి, దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని రిమాండ్ కు తరలించిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు. ధనరాజ్ అనే ఇతడు ఇంటికి కన్నాలు వేసి ఉన్నది అంతా దోచుకు వెళ్లడం ఇతని వృత్తిగా మార్చుకున్నాడు. ఇతగాడు గతంలో ఆసిఫ్ నగర్ పిస్ లిమిట్స్ చోరి కేస్ లో అరెస్టు జవైనల్ హోమ్ జైలుకి వెళ్లి వచ్చాడు. జిడిమెట్ల, సిద్ధిపేట, మహబూబ్ నగర్ పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి చోరీలకు చేస్తూ పట్టుబడి మూడు సార్లు జైలుకు వెళ్లి వచ్చిన తీరు మార్చుకోలేదు.. శంషాబాద్ పిఎస్ పరిధి లోని ఓ దేవాలయంలో చోరీకి పాల్పడి అనుమానాస్పదంగా తిరుగుతుంటే పట్టుకొని తమదైన పోలీసులు విచారించగా తన నేర చరిత్రను పూర్తిగా ఒప్పుకున్నాడని అధికారులు వెల్లడించారు బుద్ధి మార్చు కొక పోవడంతో అతనిపై పిడియాక్ట్ విధించేందుకై అధికారులు సన్నద్ధమయ్యారు. ఇతని వద్దనుండి బంగారు, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం రిమాండ్ కు తరలించిన పోలీసులు బైట్: అశోక్ కుమార్ ఏ సి పి శంషాబాద్
Last Updated : Oct 10, 2019, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.