హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ఎదుట శాట్స్ ఒప్పంద కోచ్లు మరోసారి ఆందోళనకు దిగారు. 27 ఏళ్లుగా ఒప్పంద కోచ్లుగా పని చేస్తున్న తమను క్రమబద్ధీకరించాలంటూ కోచ్లు గత కొన్ని రోజులుగా నిరసన చేపడుతున్నారు. శాట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తమకు అన్యాయం చేస్తున్నారని కోచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులరైజ్ చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ధర్నాలో అసోషియేషన్ అధ్యక్షురాలు సత్యవాణి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తోటి సిబ్బంది ఆమెను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: శాట్స్ కోచ్ల ఆందోళన.. స్పహ తప్పి పడిపోయిన అధ్యక్షురాలు