ETV Bharat / state

'ఏపీలో జులై 10 నుంచి పదో తరగతి పరీక్షలు'

author img

By

Published : Jun 10, 2020, 3:29 PM IST

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.

'జులై 10 నుంచి యథావిధిగా పదో తరగతి పరీక్షలు'
'జులై 10 నుంచి యథావిధిగా పదో తరగతి పరీక్షలు'

జులై 10 నుంచి యథావిధిగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత కాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి సురేశ్ వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.

జులై 10 నుంచి యథావిధిగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత కాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి సురేశ్ వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.