ETV Bharat / state

యాప్​ల నుంచి బెదిరింపులు వస్తుంటే ఫిర్యాదు చేయండి: డీజీపీ

ఆన్​లైన్, ఆఫ్​లైన్... ఏ విధమైన బ్యాంకుల నుంచి రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో యాప్​ల ద్వారా రుణాలు తీసుకొని తరువాత వారి వేధింపులు భరించలేక ఇటీవల పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలపై పోలీస్ బాస్ స్పందించారు. యాప్​ల నుంచి బెదిరింపులు వస్తే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

author img

By

Published : Dec 18, 2020, 9:19 PM IST

ఏ రుణాలకైనా.. సంస్థలకు ఆర్బీఐ అనుమతి తప్పనిసరి: డీజీపీ
ఏ రుణాలకైనా.. సంస్థలకు ఆర్బీఐ అనుమతి తప్పనిసరి: డీజీపీ

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పెరిగిపోతున్న ఆన్​లైన్​ రుణాల మంజూరు సంస్థల వేధింపులు... బాధితుల ఆత్మహత్యల ఘటనలపై డీజీపీ స్పందించారు. ఏ తరహా రుణాలు ఇచ్చే సంస్థలకైనా రిజర్వ్​ బ్యాంక్​ నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఆన్​లైన్ యాప్​లలో అధికశాతం ఆర్భీఐలో నమోదు కాలేదని... అందువల్ల వారికి రుణాలు మంజూరు చేసే అధికారం లేదని తెలిపారు.

ఈ ఆన్​లైన్​ యాప్​లలో అత్యధికంగా చైనాకు చెందినవే ఉన్నాయని వెల్లడించారు. వాటికి రిజిస్టర్ చిరునామా, చరవాణి నెంబర్ తదితర వివరాలు ఉండవని తెలిపారు. ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏవిధమైన షరతులు అంగీకరించొద్దని డీజీపీ సూచించారు. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని కోరారు. అంతర్జాలం ద్వారా రుణాలు ఇస్తామంటూ ప్రకటనలిస్తున్న యాప్​లు వాటిని డౌన్​లోడ్ చేసుకోవద్దన్నారు. యాప్​ల నుంచి బెదిరింపులు వస్తుంటే పోలీసులకు ఫిర్యాదులు చేయాలని డీజీపీ సూచించారు.

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పెరిగిపోతున్న ఆన్​లైన్​ రుణాల మంజూరు సంస్థల వేధింపులు... బాధితుల ఆత్మహత్యల ఘటనలపై డీజీపీ స్పందించారు. ఏ తరహా రుణాలు ఇచ్చే సంస్థలకైనా రిజర్వ్​ బ్యాంక్​ నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఆన్​లైన్ యాప్​లలో అధికశాతం ఆర్భీఐలో నమోదు కాలేదని... అందువల్ల వారికి రుణాలు మంజూరు చేసే అధికారం లేదని తెలిపారు.

ఈ ఆన్​లైన్​ యాప్​లలో అత్యధికంగా చైనాకు చెందినవే ఉన్నాయని వెల్లడించారు. వాటికి రిజిస్టర్ చిరునామా, చరవాణి నెంబర్ తదితర వివరాలు ఉండవని తెలిపారు. ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏవిధమైన షరతులు అంగీకరించొద్దని డీజీపీ సూచించారు. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని కోరారు. అంతర్జాలం ద్వారా రుణాలు ఇస్తామంటూ ప్రకటనలిస్తున్న యాప్​లు వాటిని డౌన్​లోడ్ చేసుకోవద్దన్నారు. యాప్​ల నుంచి బెదిరింపులు వస్తుంటే పోలీసులకు ఫిర్యాదులు చేయాలని డీజీపీ సూచించారు.

ఇదీ చూడండి: ఒత్తిళ్లకు యువత బలి : పరువు తీసి వేధిస్తున్న లోన్​ యాప్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.