ETV Bharat / state

NVSS PRABHAKAR: 'యాభై వేల ఉద్యోగాలు కంటి తుడుపు చర్యే' - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలోని అన్ని శాఖల్లోని ఖాళీలను(vacancies) భర్తీ చేయాలని భాజపా(bjp) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. యాభై వేల ఉద్యోగాలు(jobs in telangana) కంటి తుడుపు చర్యేనని అన్నారు. అప్పుల రాష్ట్రంగా తెలంగాణను మార్చేశారని ఆరోపించారు.

BJP, NVSS PRABHAKAR
ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, భాజపా
author img

By

Published : Jul 10, 2021, 5:45 PM IST

యాభై వేల ఉద్యోగాల భర్తీ అనేది కంటి తుడుపు చర్యేనని భాజపా(bjp) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. అన్ని శాఖల్లోని ఖాళీలను(job vacancies) భర్తీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు దిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎఫ్‌ఆర్బీఎం పెంచాలని అడుగుతారని తెలిపారు. అప్పుల రాష్ట్రంగా తెలంగాణను మార్చేశారని ప్రభాకర్ ఆరోపించారు.

అందుకే తెలంగాణకు..

ఏడేళ్లల్లో ఏడు చుక్కల నీళ్లనైనా సీఎం కేసీఆర్(cm kcr) పెంచారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి(ysr) అక్రమంగా సంపాదించిన భూములు ఎక్కడున్నాయో తెలుసుకోవాలనే షర్మిల(ys sharmila) తెలంగాణకు వచ్చారని ఆయన దుయ్యబట్టారు. భారతి భయంతోనే షర్మిల పార్టీ పెట్టారన్నారు. బయ్యారం భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు తల్లీకూతుళ్లు లోటస్‌పాండ్‌లో అడుగుపెట్టారని ఆరోపించారు.

విధుల్లోకి తీసుకోవాలి

హుజూరాబాద్‌ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈటల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరోనా(corona) కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడిన 1600మంది నర్సులను(nurse) విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

యాభై వేల ఉద్యోగాల భర్తీ అనేది కంటి తుడుపు చర్యేనని భాజపా(bjp) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. అన్ని శాఖల్లోని ఖాళీలను(job vacancies) భర్తీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు దిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎఫ్‌ఆర్బీఎం పెంచాలని అడుగుతారని తెలిపారు. అప్పుల రాష్ట్రంగా తెలంగాణను మార్చేశారని ప్రభాకర్ ఆరోపించారు.

అందుకే తెలంగాణకు..

ఏడేళ్లల్లో ఏడు చుక్కల నీళ్లనైనా సీఎం కేసీఆర్(cm kcr) పెంచారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి(ysr) అక్రమంగా సంపాదించిన భూములు ఎక్కడున్నాయో తెలుసుకోవాలనే షర్మిల(ys sharmila) తెలంగాణకు వచ్చారని ఆయన దుయ్యబట్టారు. భారతి భయంతోనే షర్మిల పార్టీ పెట్టారన్నారు. బయ్యారం భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు తల్లీకూతుళ్లు లోటస్‌పాండ్‌లో అడుగుపెట్టారని ఆరోపించారు.

విధుల్లోకి తీసుకోవాలి

హుజూరాబాద్‌ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈటల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరోనా(corona) కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడిన 1600మంది నర్సులను(nurse) విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.