ETV Bharat / state

10 నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు - cpm state secretary thammineni veerabhadram latest news

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని ఎంబీ భవన్​లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.

10 నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు
10 నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు
author img

By

Published : Sep 4, 2020, 1:58 PM IST

Updated : Sep 4, 2020, 7:10 PM IST

చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని స్మరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని ఎంబీ భవన్​లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వివరించారు. ఐలమ్మ వర్ధంతి పదో తేదీ నుంచి 17 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 10న అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ వర్ధంతి సభను నిర్వహించనున్నట్లు వివరించారు. 11 నుంచి 15 వరకు అమరవీరుల స్థూపాల వద్ద కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 13న సిద్దిపేట జిల్లా బైరాన్​పల్లి వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో రాష్ట్ర హక్కులను కాలరాస్తోందని అన్నారు.

జీఎస్టీ పరిహార చెల్లింపులకు సంబంధించి రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ నెల 8న గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కొత్త రెవెన్యూ చట్టంపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

ఇవీచూడండి: దారుణం: ఆడపిల్లలు పుట్టారని పురుగులమందు తాగించిన తండ్రి

చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని స్మరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని ఎంబీ భవన్​లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వివరించారు. ఐలమ్మ వర్ధంతి పదో తేదీ నుంచి 17 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 10న అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ వర్ధంతి సభను నిర్వహించనున్నట్లు వివరించారు. 11 నుంచి 15 వరకు అమరవీరుల స్థూపాల వద్ద కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 13న సిద్దిపేట జిల్లా బైరాన్​పల్లి వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో రాష్ట్ర హక్కులను కాలరాస్తోందని అన్నారు.

జీఎస్టీ పరిహార చెల్లింపులకు సంబంధించి రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ నెల 8న గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కొత్త రెవెన్యూ చట్టంపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

ఇవీచూడండి: దారుణం: ఆడపిల్లలు పుట్టారని పురుగులమందు తాగించిన తండ్రి

Last Updated : Sep 4, 2020, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.