ETV Bharat / state

Amit Shah: తిరుపతిలో దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం.. సీఎం కేసీఆర్ దూరం

author img

By

Published : Nov 14, 2021, 4:58 AM IST

Updated : Nov 14, 2021, 7:36 AM IST

పాలమూరు - రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలు సహా విద్యుత్ బకాయిలు, విభజన చట్టంలోని అంశాలు దక్షిణ జోనల్ సమావేశంలో (Southern States Zonal Council Meeting - 2021) చర్చకు రానున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు ప్రతిపాదించిన ఎజెండా ప్రకారం వివిధ అంశాలు చర్చకు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఎజెండాను ప్రతిపాదించనప్పటికీ, పొరుగు రాష్ట్రాలు, కేంద్రం ప్రతిపాదించిన ఎజెండా ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశాలపై కూడా భేటీలో చర్చ జరగనుంది.

Amit Shah
Amit Shah
దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం.. రాష్ట్రం తరఫున హోంమంత్రి హాజరు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) అధ్యక్షతన తిరుపతి వేదికగా ఇవాళ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది (Southern States Zonal Council Meeting - 2021). దక్షిణ భారతదేశానికి చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr not attended)సమావేశానికి హాజరు కావడం లేదు. తెలంగాణ తరఫున హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Mahmood ali) సమావేశానికి హాజరు కానున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (cs somesh Kumar), ఉన్నతాధికారులు సమావేశానికి హాజరవుతారు. సమావేశానికి సంబంధించి మొత్తం 26 అంశాలను ఎజెండాలో చేర్చారు.

పొరుగు రాష్ట్రాలు, కేంద్రం ప్రతిపాదించిన ఎజెండా ప్రకారం భేటీ

2018లో బెంగళూరులో జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు తీరుపై సమీక్ష, తదుపరి జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ప్రతిపాదించిన వాటితో పాటు ఆయా రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలను ప్రతిపాదించాయి. వాటిపై భేటీలో చర్చ జరగనుంది. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి, (Palamuru - Rangareddy) నక్కలగండి ఎత్తిపోతల పథకాలపై చర్చించాలని కర్నాటక ప్రతిపాదించింది. రెండు ప్రాజెక్టులకు ఇంకా అనుమతులు ఇవ్వలేదన్న కేంద్రజలశక్తిశాఖ (Central Department of Hydropower)... కేఆర్ఎంబీ (KRMB) పరిధిని ఖరారు చేశామని, రెండు అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయని పేర్కొంది. వాటి డీపీఆర్​లు (project dprs) ఇంకా అందలేదని తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టుల అంశం సుప్రీంకోర్టు, అపెక్స్ కౌన్సిల్, ట్రైబ్యునళ్లలో ఉన్నందున ఇక్కడ చర్చించడం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

పుదుచ్చేరి ఏమంటుందంటే..

గోదావరి - కావేరి నదుల అనుసంధానాన్ని (Godavari - Cauvery river connection) పుదుచ్చేరి ప్రతిపాదించింది. నదుల అనుసంధానం విషయంలో రాష్ట్రాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నామన్న కేంద్ర జలశక్తిశాఖ... డీపీఆర్ పై నెలరోజుల్లోగా అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలను కోరినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆమోదం కోసం డీపీఆర్​ను సమర్పించడంతో పాటు నీటివినియోగం, లబ్ధి తదితర అంశాలపై చర్చిస్తామని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ గాంధీ సంగంబండ ఆనకట్ట వల్ల తమ రాష్ట్రంలోని భూభాగం ముంపునకు గురవుతోందని కర్నాటక తెలిపింది. కర్నాటక ప్రభుత్వానికి డీపీఆర్ ఇచ్చాకే ప్రాజెక్టు నిర్మించినట్లు తెలంగాణ తెలిపింది. బీమా ఎత్తిపోతలలో భాగంగా సంగంబండ ఆనకట్ట నిర్మాణానికి 1996లో సాంకేతిక సలహా మండలి అనుమతులు వచ్చాయని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది.

కూర్చుని పరిష్కరించుకోవాలని గతంలోనే చెప్పిన కేంద్రం

రాష్ట్ర ఆవిర్భావం మొదలు 2017 జూన్ వరకు విద్యుత్ సరఫరా చేసిన బకాయిలు 6,015 కోట్ల రూపాయలు తెలంగాణ ఇవ్వాలని ఏపీ అంటోంది. ఏపీ నుంచి తమకూ బకాయిలు రావాల్సి ఉందన్న తెలంగాణ... పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఏపీ ఎన్సీఎల్టీ, హైకోర్టును ఆశ్రయించిందని అంటోంది. బకాయిల చెల్లింపు షెడ్యూల్ ఇస్తే ఎన్సీఎల్టీలో కేసు ఉపసంహరించుకుంటామని ఏపీ చెప్పింది. అయితే రెండు రాష్ట్రాల అధికారులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలో సూచించింది.

ఏపీ లేవనెత్తే అంశాలు

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య వివిధ సంస్థల పంపకాలు, విభజనపై చర్చ జరగనుంది. చట్టం, నిబంధనలకు లోబడి విభజన జరగాలని... ఆస్తుల పంపకాలు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ అంటోంది. నదీ యాజమాన్య బోర్డులు, వాటి పరిధి, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు సహా వివిధ అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి.

సమావేశానికి సంబంధించి ఎజెండాలో మొత్తం 26 అంశాలు

జోనల్ కౌన్సిల్ సమావేశంలో (Zonal Council Meeting - 2021) చర్చకు వచ్చే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేసింది. ఎజెండాలో రాష్ట్రానికి సంబంధించి ఉన్న అంశాలు, పొరుగు రాష్ట్రాలు లేవనెత్తే అభ్యంతరాలు, విషయాలకు ఇవ్వాల్సిన సమాధానాలను అధికారులు సిద్ధం చేశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హామీలు, ఇతర అంశాలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేశారు. వాటి ఆధారంగా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.

ఇదీ చూడండి: Southern Zonal Council Meeting: జోనల్​ కౌన్సిల్​ సమావేశానికి హోం మంత్రి మహమూద్‌ అలీ!

దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం.. రాష్ట్రం తరఫున హోంమంత్రి హాజరు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) అధ్యక్షతన తిరుపతి వేదికగా ఇవాళ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది (Southern States Zonal Council Meeting - 2021). దక్షిణ భారతదేశానికి చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr not attended)సమావేశానికి హాజరు కావడం లేదు. తెలంగాణ తరఫున హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Mahmood ali) సమావేశానికి హాజరు కానున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (cs somesh Kumar), ఉన్నతాధికారులు సమావేశానికి హాజరవుతారు. సమావేశానికి సంబంధించి మొత్తం 26 అంశాలను ఎజెండాలో చేర్చారు.

పొరుగు రాష్ట్రాలు, కేంద్రం ప్రతిపాదించిన ఎజెండా ప్రకారం భేటీ

2018లో బెంగళూరులో జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు తీరుపై సమీక్ష, తదుపరి జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ప్రతిపాదించిన వాటితో పాటు ఆయా రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలను ప్రతిపాదించాయి. వాటిపై భేటీలో చర్చ జరగనుంది. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి, (Palamuru - Rangareddy) నక్కలగండి ఎత్తిపోతల పథకాలపై చర్చించాలని కర్నాటక ప్రతిపాదించింది. రెండు ప్రాజెక్టులకు ఇంకా అనుమతులు ఇవ్వలేదన్న కేంద్రజలశక్తిశాఖ (Central Department of Hydropower)... కేఆర్ఎంబీ (KRMB) పరిధిని ఖరారు చేశామని, రెండు అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయని పేర్కొంది. వాటి డీపీఆర్​లు (project dprs) ఇంకా అందలేదని తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టుల అంశం సుప్రీంకోర్టు, అపెక్స్ కౌన్సిల్, ట్రైబ్యునళ్లలో ఉన్నందున ఇక్కడ చర్చించడం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

పుదుచ్చేరి ఏమంటుందంటే..

గోదావరి - కావేరి నదుల అనుసంధానాన్ని (Godavari - Cauvery river connection) పుదుచ్చేరి ప్రతిపాదించింది. నదుల అనుసంధానం విషయంలో రాష్ట్రాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నామన్న కేంద్ర జలశక్తిశాఖ... డీపీఆర్ పై నెలరోజుల్లోగా అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలను కోరినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆమోదం కోసం డీపీఆర్​ను సమర్పించడంతో పాటు నీటివినియోగం, లబ్ధి తదితర అంశాలపై చర్చిస్తామని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ గాంధీ సంగంబండ ఆనకట్ట వల్ల తమ రాష్ట్రంలోని భూభాగం ముంపునకు గురవుతోందని కర్నాటక తెలిపింది. కర్నాటక ప్రభుత్వానికి డీపీఆర్ ఇచ్చాకే ప్రాజెక్టు నిర్మించినట్లు తెలంగాణ తెలిపింది. బీమా ఎత్తిపోతలలో భాగంగా సంగంబండ ఆనకట్ట నిర్మాణానికి 1996లో సాంకేతిక సలహా మండలి అనుమతులు వచ్చాయని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది.

కూర్చుని పరిష్కరించుకోవాలని గతంలోనే చెప్పిన కేంద్రం

రాష్ట్ర ఆవిర్భావం మొదలు 2017 జూన్ వరకు విద్యుత్ సరఫరా చేసిన బకాయిలు 6,015 కోట్ల రూపాయలు తెలంగాణ ఇవ్వాలని ఏపీ అంటోంది. ఏపీ నుంచి తమకూ బకాయిలు రావాల్సి ఉందన్న తెలంగాణ... పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఏపీ ఎన్సీఎల్టీ, హైకోర్టును ఆశ్రయించిందని అంటోంది. బకాయిల చెల్లింపు షెడ్యూల్ ఇస్తే ఎన్సీఎల్టీలో కేసు ఉపసంహరించుకుంటామని ఏపీ చెప్పింది. అయితే రెండు రాష్ట్రాల అధికారులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం గతంలో సూచించింది.

ఏపీ లేవనెత్తే అంశాలు

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య వివిధ సంస్థల పంపకాలు, విభజనపై చర్చ జరగనుంది. చట్టం, నిబంధనలకు లోబడి విభజన జరగాలని... ఆస్తుల పంపకాలు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ అంటోంది. నదీ యాజమాన్య బోర్డులు, వాటి పరిధి, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు సహా వివిధ అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి.

సమావేశానికి సంబంధించి ఎజెండాలో మొత్తం 26 అంశాలు

జోనల్ కౌన్సిల్ సమావేశంలో (Zonal Council Meeting - 2021) చర్చకు వచ్చే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేసింది. ఎజెండాలో రాష్ట్రానికి సంబంధించి ఉన్న అంశాలు, పొరుగు రాష్ట్రాలు లేవనెత్తే అభ్యంతరాలు, విషయాలకు ఇవ్వాల్సిన సమాధానాలను అధికారులు సిద్ధం చేశారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హామీలు, ఇతర అంశాలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేశారు. వాటి ఆధారంగా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.

ఇదీ చూడండి: Southern Zonal Council Meeting: జోనల్​ కౌన్సిల్​ సమావేశానికి హోం మంత్రి మహమూద్‌ అలీ!

Last Updated : Nov 14, 2021, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.