TS HC Accepted Boy's death in dogs attack As sumoto : హైదరాబాద్ నగరంలో ఆదివారం కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు (ప్రదీప్) మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటో పిటిషన్గా స్వీకరించింది. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తలను పిల్గా పరిగణించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ దీనిపై ఈరోజు విచారణ చేయనుంది. ఈ పిటిషన్కు సంబంధించి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ అంబర్పేట డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీని ప్రతివాదులుగా చేసింది.
శునకాల దాడులపై హెచ్ఆర్సీకి కాంగ్రెస్ ఫిర్యాదు: కుక్కల దాడిలో ఓ నాలుగేళ్ల బాలుడు మరణించిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం నిన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. అనంతరం గృహకల్ప కాంప్లెక్స్ ప్రాంగణంలో పార్టీ ప్రతినిధుల బృందం ప్లకార్డులు ప్రదర్శించారు. కుక్కలను అదుపు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలపై కేసులు నమోదు చేయాలని కమిషన్ను కోరామని వారు తెలిపారు.
ఇదీ జరిగింది: నిజామాబాద్కు చెందిన ముత్యం గంగాధర్ ఛే నెంబర్ చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్లో వాచ్మెన్గా పని చేస్తూ జీవిస్తున్నారు. భార్య జనప్రియ, ఒక కుమార్తె(8), కుమారుడు ప్రదీప్(4)లతో కలిసి బాగ్ అంబర్పేట్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో పిల్లలిద్దరిని తీసుకొని తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ దగ్గరకు వెళ్లాడు గంగాధర్. ప్రదీప్ ఆడుకుంటుండడంతో తండ్రి పనుల్లో నిమగ్నమయ్యాడు.
పక్కనే అడుకుంటున్న అక్క కోసం ప్రదీప్ వెళ్తుండగా.. ఒక్కసారిగా అతడిని కుక్కలు రౌండప్ చేశాయి. ఆ వీధి కుక్కలను చూసి భయపడిన బాలుడు (ప్రదీప్) తప్పించుకునేందుకు అటూ ఇటూ పరిగెత్తాడు. ఎంతకీ వదలని కుక్కలు.. ఒకదాని తరువాత ఒకటి దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రదీప్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇవీ చదవండి: