ETV Bharat / state

తెలంగాణలో కొవిడ్​ సెకండ్ వేవ్ ముగిసిపోయింది: డీహెచ్‌ శ్రీనివాస్‌

రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. అన్ని జ్వరాలు కొవిడ్​ జ్వరాలు అనుకోవద్దని పేర్కొన్నారు. సీజనల్​ వ్యాధులు పెరగకుండా చర్యలు చేపట్టామని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

author img

By

Published : Aug 18, 2021, 3:44 PM IST

Updated : Aug 18, 2021, 9:22 PM IST

dh srinivas rao
dh srinivas rao

రాష్ట్రంలో కొవిడ్​ సెకండ్ వేవ్ ముగిసిందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావు పేర్కొన్నారు. కోఠిలోని డీపీహెచ్​ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన... కరోనా సెకండ్​వేవ్​ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిలువరించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలలను తిరిగి ప్రారంభించడంపై జరిగిన సమావేశంలోనూ..... తమ అభిప్రాయాల్ని ప్రభుత్వానికి తెలిపానని చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి దాదాపు వాక్సినేషన్ పూర్తైందని... ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటే ముందుకురావాలని కోరారు. థర్డ్​ వేవ్ వస్తే ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఆస్పత్రులు, ఆక్సిజన్ సరఫరా సహా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

అప్రమత్తంగా ఉండండి..

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయని డీహెచ్ శ్రీనివాస రావు ప్రకటించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు వస్తున్నాయని.. హైదరాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు బయటపడ్డాయని డీహెచ్​ వెల్లడించారు. ఇప్పటివరకు 1,200 డెంగీ కేసులు వచ్చాయని... మొత్తంగా 13 జిల్లాల్లో మలేరియా, డెంగీ జ్వరాల కేసులు వచ్చాయని తెలిపారు. ఇకనుంచి వారానికోరోజు డ్రై డేగా పాటించాలని డీహెచ్ పిలుపునిచ్చారు. ఎవరికైనా జ్వరం వస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందుగా పరీక్షలు చేయించుకోవాలని డీహెచ్​ సూచించారు. పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా.. లార్వా పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ దోమ పగటి వేళ కుడుతుందని.. ఇళ్లలో దోమలు రాకుండా చూసుకోవాలన్నారు.

ఇంటి వద్దకే వ్యాక్సిన్​..!

రాష్ట్రంలో ఆర్​ఫ్యాక్టర్ 0.7 % మాత్రమే ఉందని.... పోస్ట్​ కొవిడ్​తో ఆస్పత్రిలో చేరిన వారు ఎక్కువగా ఉన్నారని ప్రకటించారు. దీర్ఘకాల కొవిడ్​ ఎఫెక్ట్​ కారణంగా కారణంగా మనసిక సమస్యలు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.65 కోట్ల మందికి వ్యాక్సినేషన్​ పూర్తైందని తెలిపారు. హైదరాబాద్ జిల్లాల్లో వాక్సినేషన్ వందశాతం పూర్తయిందని డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 90శాతం వాక్సినేషన్ పూర్తైందని... రాష్ట్ర వ్యాప్తంగా 56% మందికి కనీసం ఒక డోస్ వాక్సినేషన్ ఇచ్చామన్నారు. అయితే రెండు డోసులు పూర్తైన వారు మాత్రం 34శాతం మాత్రమే కావడం గమనార్హం. రాష్ట్రంలో వాక్సినేషన్ పెంచేందుకు ప్రత్యేకంగా "వ్యాక్సిన్ ఆన్​వీల్స్" కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో ఇంటి వద్దకే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణలో కొవిడ్​ సెకండ్ వేవ్ ముగిసిపోయింది: డీహెచ్‌ శ్రీనివాస్‌

అన్ని జ్వరాలు కొవిడ్​ జ్వరాలు కాదు..

రాష్ట్రంలో కొవిడ్‌ సెకండ్ వేవ్ ముగిసిపోయింది. సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయి. అన్ని జ్వరాలు కొవిడ్ జ్వరాలు అనుకోవద్దు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. రాష్ట్రంలో 1.65 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తైంది. 56 శాతం మందికి తొలి డోసు, 34 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో దాదాపు 100 శాతం మందికి కనీసం ఒక డోస్ పూర్తికాగా... జీహెచ్‌ఎంసీలో 90శాతం మందికి కనీసం ఒక డోస్ పూర్తయింది. -డా.శ్రీనివాసరావు, ప్రజారోగ్య శాఖ సంచాలకులు.

ఇదీ చూడండి: THIRD WAVE: అత్యవసర నిధుల కింద రూ.456 కోట్లు కేటాయింపు

రాష్ట్రంలో కొవిడ్​ సెకండ్ వేవ్ ముగిసిందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావు పేర్కొన్నారు. కోఠిలోని డీపీహెచ్​ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన... కరోనా సెకండ్​వేవ్​ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిలువరించిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలలను తిరిగి ప్రారంభించడంపై జరిగిన సమావేశంలోనూ..... తమ అభిప్రాయాల్ని ప్రభుత్వానికి తెలిపానని చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి దాదాపు వాక్సినేషన్ పూర్తైందని... ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటే ముందుకురావాలని కోరారు. థర్డ్​ వేవ్ వస్తే ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఆస్పత్రులు, ఆక్సిజన్ సరఫరా సహా వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

అప్రమత్తంగా ఉండండి..

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నాయని డీహెచ్ శ్రీనివాస రావు ప్రకటించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు వస్తున్నాయని.. హైదరాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు బయటపడ్డాయని డీహెచ్​ వెల్లడించారు. ఇప్పటివరకు 1,200 డెంగీ కేసులు వచ్చాయని... మొత్తంగా 13 జిల్లాల్లో మలేరియా, డెంగీ జ్వరాల కేసులు వచ్చాయని తెలిపారు. ఇకనుంచి వారానికోరోజు డ్రై డేగా పాటించాలని డీహెచ్ పిలుపునిచ్చారు. ఎవరికైనా జ్వరం వస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందుగా పరీక్షలు చేయించుకోవాలని డీహెచ్​ సూచించారు. పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా.. లార్వా పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ దోమ పగటి వేళ కుడుతుందని.. ఇళ్లలో దోమలు రాకుండా చూసుకోవాలన్నారు.

ఇంటి వద్దకే వ్యాక్సిన్​..!

రాష్ట్రంలో ఆర్​ఫ్యాక్టర్ 0.7 % మాత్రమే ఉందని.... పోస్ట్​ కొవిడ్​తో ఆస్పత్రిలో చేరిన వారు ఎక్కువగా ఉన్నారని ప్రకటించారు. దీర్ఘకాల కొవిడ్​ ఎఫెక్ట్​ కారణంగా కారణంగా మనసిక సమస్యలు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.65 కోట్ల మందికి వ్యాక్సినేషన్​ పూర్తైందని తెలిపారు. హైదరాబాద్ జిల్లాల్లో వాక్సినేషన్ వందశాతం పూర్తయిందని డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 90శాతం వాక్సినేషన్ పూర్తైందని... రాష్ట్ర వ్యాప్తంగా 56% మందికి కనీసం ఒక డోస్ వాక్సినేషన్ ఇచ్చామన్నారు. అయితే రెండు డోసులు పూర్తైన వారు మాత్రం 34శాతం మాత్రమే కావడం గమనార్హం. రాష్ట్రంలో వాక్సినేషన్ పెంచేందుకు ప్రత్యేకంగా "వ్యాక్సిన్ ఆన్​వీల్స్" కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో ఇంటి వద్దకే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణలో కొవిడ్​ సెకండ్ వేవ్ ముగిసిపోయింది: డీహెచ్‌ శ్రీనివాస్‌

అన్ని జ్వరాలు కొవిడ్​ జ్వరాలు కాదు..

రాష్ట్రంలో కొవిడ్‌ సెకండ్ వేవ్ ముగిసిపోయింది. సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నాయి. అన్ని జ్వరాలు కొవిడ్ జ్వరాలు అనుకోవద్దు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. రాష్ట్రంలో 1.65 కోట్ల మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తైంది. 56 శాతం మందికి తొలి డోసు, 34 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లో దాదాపు 100 శాతం మందికి కనీసం ఒక డోస్ పూర్తికాగా... జీహెచ్‌ఎంసీలో 90శాతం మందికి కనీసం ఒక డోస్ పూర్తయింది. -డా.శ్రీనివాసరావు, ప్రజారోగ్య శాఖ సంచాలకులు.

ఇదీ చూడండి: THIRD WAVE: అత్యవసర నిధుల కింద రూ.456 కోట్లు కేటాయింపు

Last Updated : Aug 18, 2021, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.