Telangana Govt for students: భారతప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా స్వదేశం చేరుకున్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటోంది. ఉక్రెయిన్ నుంచి విమానాల్లో దిల్లీ, ముంబయి చేరుకున్న విద్యార్థులను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వారికి అవసరమైన విమాన టికెట్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే ఫిబ్రవరి 26వ తేదీన బుచారెస్ట్-ముంబయికి 15 మంది, 27న బుచారెస్ట్-దిల్లీ 16మంది, బుచారెస్ట్-దిల్లీ 9మంది, 28న బుచారెస్ట్-దిల్లీ 14 మంది, మార్చి 1వ తేదీన బుచారెస్ట్-ముంబయికి ఇద్దరు, బుచారెస్ట్- దిల్లీకి 11మంది తెలంగాణ వాసులు స్వదేశానికి తిరిగివచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ వాసులకు దిల్లీ, ముంబయి విమానాశ్రయాల నుంచి తరలించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
ఇదీ చూడండి: