ETV Bharat / state

గాంధీ భవన్​లో అవతరణ దినోత్సవ వేడుకలు

author img

By

Published : Jun 2, 2019, 11:51 AM IST

తెలంగాణ రాష్ట్ర ఐదో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. హైదరాబాద్​ గాంధీ భవన్​లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు పాల్గొన్నారు.

గాంధీ భవన్​

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ గాంధీ భవన్​లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో జానారెడ్డి, వీహెచ్​, ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి, కుసుమ కుమార్, షబ్బీర్ అలీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సోనియా గాంధీ వల్లే తెలంగాణ

సోనియాగాంధీ వల్లే ఎన్నో ఏళ్ల తెలంగాణ కల సాకారమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్​ ఎంపీల పోరాటం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని ప్రశంసించారు. 60 ఏళ్లలో 69 వేల కోట్ల అప్పులైతే నూతన రాష్ట్రం ఏర్పాడ్డాక 2 లక్షల 60 వేల కోట్లు వరకూ పెరిగాయని అన్నారు. అందుకు తగిన విధంగా అభివృద్ధి జరగలేదని వెల్లడించారు. ఎన్నికల్లో ఏ హామీని తెరాస ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా కేసీఆర్​ పాలన ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో తెరాసను ఓడించేది హస్తం పార్టీయేనని పునరుద్ఘాటించారు.

గాంధీ భవన్​లో రాష్ట్ర అవతరణ వేడుకలు

ఇదీ చూడండి : 'అవినీతిని అంతమొందించేందుకు కొత్త రెవెన్యూ చట్టం'

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ గాంధీ భవన్​లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో జానారెడ్డి, వీహెచ్​, ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి, కుసుమ కుమార్, షబ్బీర్ అలీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సోనియా గాంధీ వల్లే తెలంగాణ

సోనియాగాంధీ వల్లే ఎన్నో ఏళ్ల తెలంగాణ కల సాకారమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్​ ఎంపీల పోరాటం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని ప్రశంసించారు. 60 ఏళ్లలో 69 వేల కోట్ల అప్పులైతే నూతన రాష్ట్రం ఏర్పాడ్డాక 2 లక్షల 60 వేల కోట్లు వరకూ పెరిగాయని అన్నారు. అందుకు తగిన విధంగా అభివృద్ధి జరగలేదని వెల్లడించారు. ఎన్నికల్లో ఏ హామీని తెరాస ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా కేసీఆర్​ పాలన ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో తెరాసను ఓడించేది హస్తం పార్టీయేనని పునరుద్ఘాటించారు.

గాంధీ భవన్​లో రాష్ట్ర అవతరణ వేడుకలు

ఇదీ చూడండి : 'అవినీతిని అంతమొందించేందుకు కొత్త రెవెన్యూ చట్టం'

Intro:tg_srd_27_02_formetion_day_celebrations_av_g4
( ).... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ కేంద్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేడుకల్లో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మొహమ్మద్ ఫరీదుద్దీన్ పాల్గొని జండా వందనం సమర్పించారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డిఓ అబ్దుల్ హమీద్, డివిజన్ పోలీస్ కార్యాలయంలో డిఎస్పి గణపతి జాదవ్, మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ షబానా బేగం, ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ చిరంజీవి ప్రసాద్, తాసిల్దార్ కార్యాలయంలో దారి సుబ్రహ్మణ్యం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అవతరణ వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయం అధికారులు ముస్తాబు చేశారు.


Body:@


Conclusion:@
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.