హైదరాబాద్ నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్ (Human right commission) కార్యాలయంలో... రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య తెలుగు తల్లి చిత్ర పటానికి పూలమాల వేసి.. అమరులకు నివాళులు అర్పించారు.
కమిషన్ సభ్యులతో కలిసి ఆయన జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. కమిషన్ ఉద్యోగులకు, రాష్ట్ర ప్రజలకు ఆయన తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇది చూడండి: ఈ వానాకాలంలో వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపాలి: నిరంజన్ రెడ్డి