ETV Bharat / state

టీఎస్​పీఎస్​సీ ఛైర్మన్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసులు

author img

By

Published : Jun 11, 2021, 10:29 PM IST

కారుణ్య నియామకం విషయంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై హైకోర్టు(telangana high court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు విద్యా శాఖ అప్పటి కార్యదర్శి, ప్రస్తుత టీఎస్​పీఎస్​సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి(tspsc chairman), విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలకు హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇద్దరినీ ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని వెల్లడించింది.

Telangana high court news today
టీఎస్​పీఎస్​సీ ఛైర్మన్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసులు

కారుణ్య నియామకం కోసం ఓ వ్యక్తి ఇచ్చిన వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలను అమలు చేయనందుకు… విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టీఎస్​పీఎస్​సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి(tspsc chairman)పై హైకోర్టు(telangana high court) ఆగ్రహం వ్యక్తం చేసింది. సందీప్ కుమార్ సుల్తానియా, జనార్దన్ రెడ్డికి హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఇద్దరినీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

తన తండ్రి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ 2010లో మరణించారని.. కారుణ్య నియామకం కింద తనకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని… ఫరూఖీ అనే వ్యక్తి విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫరూఖీకి 15 ఏళ్లే ఉన్నాయన్న కారణంగా దరఖాస్తును నిరాకరించారు. తనకు కొన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇచ్చిన మరో దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో… 2017 కోర్టును ఆశ్రయించి ఫరూఖీ వేసిన పిటిషన్​ను సింగిల్ జడ్జి కొట్టివేయడంతో ధర్మాసనాన్ని(telangana high court) ఆశ్రయించారు.

విచారణ జరిపిన ధర్మాసనం ఫరూఖీ వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. హైకోర్టు(telangana high court) ఆదేశాలను కూడా అమలు చేయడం లేదని… ఫరూఖీ 2019లో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. విద్యా శాఖ అప్పటి కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉద్యోగ విరమణ చేశారని.. కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. నిరాకరించిన హైకోర్టు(telangana high court) బి.జనార్దన్ రెడ్డి(tspsc chairman), సందీప్ కుమార్ సుల్తానియాకు నోటీసులు జారీ చేసి… ఈ నెల 16న హాజరు కావాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: suspension: మృతుని భార్యతో వివాహేతర సంబంధం.. ఎస్​ఐ సస్పెన్షన్​!

కారుణ్య నియామకం కోసం ఓ వ్యక్తి ఇచ్చిన వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలను అమలు చేయనందుకు… విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టీఎస్​పీఎస్​సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి(tspsc chairman)పై హైకోర్టు(telangana high court) ఆగ్రహం వ్యక్తం చేసింది. సందీప్ కుమార్ సుల్తానియా, జనార్దన్ రెడ్డికి హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఇద్దరినీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

తన తండ్రి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ 2010లో మరణించారని.. కారుణ్య నియామకం కింద తనకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని… ఫరూఖీ అనే వ్యక్తి విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫరూఖీకి 15 ఏళ్లే ఉన్నాయన్న కారణంగా దరఖాస్తును నిరాకరించారు. తనకు కొన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇచ్చిన మరో దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో… 2017 కోర్టును ఆశ్రయించి ఫరూఖీ వేసిన పిటిషన్​ను సింగిల్ జడ్జి కొట్టివేయడంతో ధర్మాసనాన్ని(telangana high court) ఆశ్రయించారు.

విచారణ జరిపిన ధర్మాసనం ఫరూఖీ వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. హైకోర్టు(telangana high court) ఆదేశాలను కూడా అమలు చేయడం లేదని… ఫరూఖీ 2019లో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. విద్యా శాఖ అప్పటి కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉద్యోగ విరమణ చేశారని.. కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. నిరాకరించిన హైకోర్టు(telangana high court) బి.జనార్దన్ రెడ్డి(tspsc chairman), సందీప్ కుమార్ సుల్తానియాకు నోటీసులు జారీ చేసి… ఈ నెల 16న హాజరు కావాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: suspension: మృతుని భార్యతో వివాహేతర సంబంధం.. ఎస్​ఐ సస్పెన్షన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.