ETV Bharat / state

Telangana Congress Screening Committee : నేడే స్క్రీనింగ్ కమిటీ సమావేశం.. త్వరలో కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితా

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2023, 7:33 AM IST

Telangana Congress Screening Committee: కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం నేడు, రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ సిఫార్సు చేసిన.. అభ్యర్థుల జాబితాను కమిటీ వడపోత పోయనుంది. ఇప్పటికే చేసిన పలు సర్వేనివేదికలు, పీఈసీ జాబితాను నిశితంగా పరిశీలించిన అనంతరం.. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనుంది.

Pradesh Election Committee Report
Telangana Congress Screening Committee
Telangana Congress Screening Committee నేడే స్క్రీనింగ్ కమిటీ సమావేశం.. త్వరలో కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితా

Telangana Congress Screening Committee : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే గెలుపుగుర్రాలపై.. కాంగ్రెస్‌ దృష్టిసారించింది. నేడు, రేపు దిల్లీలో సమావేశం కానున్న స్క్రీనింగ్‌ కమిటీ.. అభ్యర్థుల ఎంపిక(Telangana Congress MLAs List)ను పూర్తిచేయనుంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ- పీఈసీ ప్రతిపాదనలపై ఇప్పటికే సర్వే పూర్తైనట్లు తెలుస్తోంది. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 20కి పైగా నియోజకవర్గాల్లో పీఈసీ ఒక్కరి పేరునే సూచించినట్లు తెలుస్తోంది. వారిలోనూ ప్రత్యర్థులతో తలపడే శక్తిసామర్థ్యం ఉందా లేదా కోణంలోనూ సర్వే నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. 25 నుంచి 30 చోట్ల ఇద్దరి పేర్లు, దాదాపు 50 నియోజకవర్గాలకు ముగ్గురు, మరో 10 నుంచి 14 నియోజకవర్గాలకు నలుగురి పేర్లను.. స్క్రీనింగ్ కమిటీకి పీఈసీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

Telangana Congress MLA Candidates 2023 : ఈ మొత్తంగా కలిపి దాదాపు 300 మంది పేర్లను ప్రదేశ్ ఎన్నికల కమిటీ.. స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేసినట్టుగా విశ్వసనీయవర్గాల సమాచారం. స్క్రీనింగ్ కమిటీ ఇవాళ రేపు రెండు రోజులు సమావేశం కొనసాగినప్పటికీ పీఈసీ జాబితా నిశితంగా పరిశీలించి అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రానుంది. వన్​ నేషన్.. వన్​ ఎలక్షన్ విధానములో జమిలి ఎన్నికలు(Jamili Elections 2024) వస్తున్నట్లు ప్రచారం అవుతుండటంతో.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకొని స్క్రీనింగ్ కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీకే నివేదించనుంది.

పీఈసీ జాబితాని నిశితంగా పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిటీకి.. కాంగ్రెస్​ స్క్రీనింగ్‌ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టికెట్లకోసం పోటీపడుతున్న ఆశావహుల్లో కొందరు ఢిల్లీ బాటపట్టారు. ప్రధానంగా స్క్రీనింగ్ వద్ద తమ గురించి ప్రస్తావించి టికెట్‌ వచ్చేటట్టుగా చూడాలని.. ఏఐసీసీ నేతలను ఆశావహులు కోరుతున్నారు.

Rahul Gandhi At Congress Vijayabheri Sabha : '100 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటికే'

కొందరు నాయకులు దిల్లీ వెళ్లి స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేసుకునే పనిలో.. తీరిక లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలు స్థానిక, రాజకీయ పరిణామాలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కర్ణాటకలో తరహాలో పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరిగితే.. పైరవీకారులకు ఏమాత్రం చోటుండదని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Congress MLA Tickets 2023 : గెలవలేని, ప్రజాబలం లేని వారికి.. టికెట్‌ ఇవ్వకుండా నిలువరించడం, ప్రజల్లోకి సానుకూల వాతావరణాన్ని తీసుకెళ్తే.. పార్టీ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో దిల్లీలోనే ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎంపీ మురళీధరన్, సభ్యులు బాబా సిద్ధిఖి, జిగ్నేష్ మేవానిలతో పాటు.. ఎంపీలు ఉత్తమ్​కుమార్​రెడ్డి, రేవంత్​ రెడ్డి(Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్​రావు ఠాక్రేతో పాటు ముగ్గురు ఏఐసీసీ ఇంఛార్జ్​ కార్యదర్శులు స్క్రీనింగ్ కమిటీలో పాల్గొనాల్సి ఉంది. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రమే దిల్లీకి వెళ్లాల్సి ఉంది.

Revanth Reddy Counter to BRS Leaders : 'కేసీఆర్‌ సర్కారుకు ఇంకా 99 రోజులే మిగిలి ఉన్నాయి.. బీఆర్​ఎస్​ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు'

Congress Six Guarantees Telangana : విజయభేరి సభలో కాంగ్రెస్ ప్రకటించిన '6 గ్యారెంటీలు' ఇవే!

Telangana Congress Screening Committee నేడే స్క్రీనింగ్ కమిటీ సమావేశం.. త్వరలో కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితా

Telangana Congress Screening Committee : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే గెలుపుగుర్రాలపై.. కాంగ్రెస్‌ దృష్టిసారించింది. నేడు, రేపు దిల్లీలో సమావేశం కానున్న స్క్రీనింగ్‌ కమిటీ.. అభ్యర్థుల ఎంపిక(Telangana Congress MLAs List)ను పూర్తిచేయనుంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ- పీఈసీ ప్రతిపాదనలపై ఇప్పటికే సర్వే పూర్తైనట్లు తెలుస్తోంది. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 20కి పైగా నియోజకవర్గాల్లో పీఈసీ ఒక్కరి పేరునే సూచించినట్లు తెలుస్తోంది. వారిలోనూ ప్రత్యర్థులతో తలపడే శక్తిసామర్థ్యం ఉందా లేదా కోణంలోనూ సర్వే నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. 25 నుంచి 30 చోట్ల ఇద్దరి పేర్లు, దాదాపు 50 నియోజకవర్గాలకు ముగ్గురు, మరో 10 నుంచి 14 నియోజకవర్గాలకు నలుగురి పేర్లను.. స్క్రీనింగ్ కమిటీకి పీఈసీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

Telangana Congress MLA Candidates 2023 : ఈ మొత్తంగా కలిపి దాదాపు 300 మంది పేర్లను ప్రదేశ్ ఎన్నికల కమిటీ.. స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేసినట్టుగా విశ్వసనీయవర్గాల సమాచారం. స్క్రీనింగ్ కమిటీ ఇవాళ రేపు రెండు రోజులు సమావేశం కొనసాగినప్పటికీ పీఈసీ జాబితా నిశితంగా పరిశీలించి అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రానుంది. వన్​ నేషన్.. వన్​ ఎలక్షన్ విధానములో జమిలి ఎన్నికలు(Jamili Elections 2024) వస్తున్నట్లు ప్రచారం అవుతుండటంతో.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకొని స్క్రీనింగ్ కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీకే నివేదించనుంది.

పీఈసీ జాబితాని నిశితంగా పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిటీకి.. కాంగ్రెస్​ స్క్రీనింగ్‌ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టికెట్లకోసం పోటీపడుతున్న ఆశావహుల్లో కొందరు ఢిల్లీ బాటపట్టారు. ప్రధానంగా స్క్రీనింగ్ వద్ద తమ గురించి ప్రస్తావించి టికెట్‌ వచ్చేటట్టుగా చూడాలని.. ఏఐసీసీ నేతలను ఆశావహులు కోరుతున్నారు.

Rahul Gandhi At Congress Vijayabheri Sabha : '100 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటికే'

కొందరు నాయకులు దిల్లీ వెళ్లి స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేసుకునే పనిలో.. తీరిక లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలు స్థానిక, రాజకీయ పరిణామాలు, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కర్ణాటకలో తరహాలో పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరిగితే.. పైరవీకారులకు ఏమాత్రం చోటుండదని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Congress MLA Tickets 2023 : గెలవలేని, ప్రజాబలం లేని వారికి.. టికెట్‌ ఇవ్వకుండా నిలువరించడం, ప్రజల్లోకి సానుకూల వాతావరణాన్ని తీసుకెళ్తే.. పార్టీ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో దిల్లీలోనే ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎంపీ మురళీధరన్, సభ్యులు బాబా సిద్ధిఖి, జిగ్నేష్ మేవానిలతో పాటు.. ఎంపీలు ఉత్తమ్​కుమార్​రెడ్డి, రేవంత్​ రెడ్డి(Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్​రావు ఠాక్రేతో పాటు ముగ్గురు ఏఐసీసీ ఇంఛార్జ్​ కార్యదర్శులు స్క్రీనింగ్ కమిటీలో పాల్గొనాల్సి ఉంది. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రమే దిల్లీకి వెళ్లాల్సి ఉంది.

Revanth Reddy Counter to BRS Leaders : 'కేసీఆర్‌ సర్కారుకు ఇంకా 99 రోజులే మిగిలి ఉన్నాయి.. బీఆర్​ఎస్​ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు'

Congress Six Guarantees Telangana : విజయభేరి సభలో కాంగ్రెస్ ప్రకటించిన '6 గ్యారెంటీలు' ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.