ఎన్నికల సమయంలో బదిలీ చేసిన తహసీల్దార్లను వెంటనే సొంత జిల్లాలకు పంపించి, సాధారణ బదిలీలు చేపట్టాలంటూ తహసీల్దార్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసేందుకు ఆ సంఘం ప్రతినిధులు సచివాలయానికి వచ్చారు. సీఎస్ అందుబాటులో లేనందున కార్యాలయంలో నోటీసులు అందజేశారు. తమ డిమాండ్ల సాధన కోసం నేటి నుంచి వర్క్ టూ రూల్గా... ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విధులు నిర్వహిస్తామని తెలిపారు. భోజన విరామ సమయంలో కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల కార్యాలయంలో నిరసన తెలుపుతామని, ఈ నెల 15 వ తేదీ నుంచి సామూహిక సెలవుల్లో వెళ్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: సర్వాంగసుందరంగా ముస్తాబవుతోన్న యాదాద్రీశుడి ఆలయం