ETV Bharat / state

ఆ పాత రుచులు మధురం...

కొర్రల పాయసం... రాగి జావ... మినుప లడ్డూలు... జొన్న కిచిడీ... మటన్‌ మిల్లెట్లు... అబ్బా చెప్తుంటేనే నోరూరిపోతోంది కదా. మరి ఇవన్నీ ఒకే చోట ఉంటే... వీటన్నింటిని వంటలు చేయడంలో ఆరితేరిన వారు తయారు చేస్తే ఈ రుచే వేరు. గచ్చిబౌలిలోని నిథమ్‌లో నిర్వహించిన సంప్రదాయ వంటల పోటీలు అదుర్స్‌ అనిపించాయి. ఈపోటీల్లో 90 మంది గృహిణులు, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు పాల్గొని చవులూరించే వంటకాలను తయారు చేశారు.

author img

By

Published : Jun 1, 2019, 12:14 AM IST

ఆ పాత రుచులు మధురం...
ఆ పాత రుచులు మధురం...

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని నిథమ్‌లో పాతకాలపు సంప్రదాయ వంటలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వంటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పోటీదారు ఒక ప్రధాన వంటకం మరియు ఒక డెజర్ట్స్‌, మిల్లెట్‌, రాగి వంటి సాంప్రదాయక పంట దినుసులనుపయోగించి చేయాలి. నూతన, ఆరోగ్యకరమైన పోషక మరియు సంప్రదాయ ఆహార వంటకాలను పరిచయం చేయడమే ఈ పోటీ ప్రదాన లక్ష్యం.

మా జీవన వైవిధ్యం, మా ఆహారం, మన ఆరోగ్యం పేరిట నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 మంది పోటీపడ్డారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు, గృహిణులు, నిణుపులు ఇలా మూడు విభాగాలుగా ఈ పోటీలను నిర్వహించారు. ఇందులో హైదరాబాద్‌, వికారాబాద్‌కు చెందిన పలువురు గృహిణులు ఎంతో ఉత్సహంగా పాల్గొని తమ సంప్రదాయ వంటకాలను తయారు చేసి ఇతరులకు పరిచయం చేశారు. వికారాబాద్‌ నుంచి వచ్చిన ఇద్దరు గిరిజన మహిళాలు వారి సంప్రదాయ వంటలైనా జొన్న గట్క, రాగి జావ తయారు చేసి ఔరా అనిపించారు.

రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించడం వలన తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు. పోటీలకు మహిళలు ఉత్సాహం చూపడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు మాజీ ఛైర్మన్‌ అంపయ్య. మన పూర్వీకులు మనకు చక్కటి రుచికరమైన వంటకాలను అందించారని... కాలం మార్పులతో పాటు మన సంప్రదాయ వంటల్లో మార్పులు వచ్చాయన్నారు.

జీవవైవిధ్యంపై దృష్టి కేంద్రీకరించి, ఆహారపు అలవాట్లను మార్చి మానవ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ పోటీలు సాగాయి. ఇలాంటి పోటీలతో ప్రజల్లో మరింత అవగాహన పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

ఇవీ చూడండి: వడగాల్పులు మరో 5రోజులు..!

ఆ పాత రుచులు మధురం...

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని నిథమ్‌లో పాతకాలపు సంప్రదాయ వంటలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వంటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పోటీదారు ఒక ప్రధాన వంటకం మరియు ఒక డెజర్ట్స్‌, మిల్లెట్‌, రాగి వంటి సాంప్రదాయక పంట దినుసులనుపయోగించి చేయాలి. నూతన, ఆరోగ్యకరమైన పోషక మరియు సంప్రదాయ ఆహార వంటకాలను పరిచయం చేయడమే ఈ పోటీ ప్రదాన లక్ష్యం.

మా జీవన వైవిధ్యం, మా ఆహారం, మన ఆరోగ్యం పేరిట నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 మంది పోటీపడ్డారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు, గృహిణులు, నిణుపులు ఇలా మూడు విభాగాలుగా ఈ పోటీలను నిర్వహించారు. ఇందులో హైదరాబాద్‌, వికారాబాద్‌కు చెందిన పలువురు గృహిణులు ఎంతో ఉత్సహంగా పాల్గొని తమ సంప్రదాయ వంటకాలను తయారు చేసి ఇతరులకు పరిచయం చేశారు. వికారాబాద్‌ నుంచి వచ్చిన ఇద్దరు గిరిజన మహిళాలు వారి సంప్రదాయ వంటలైనా జొన్న గట్క, రాగి జావ తయారు చేసి ఔరా అనిపించారు.

రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించడం వలన తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు. పోటీలకు మహిళలు ఉత్సాహం చూపడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు మాజీ ఛైర్మన్‌ అంపయ్య. మన పూర్వీకులు మనకు చక్కటి రుచికరమైన వంటకాలను అందించారని... కాలం మార్పులతో పాటు మన సంప్రదాయ వంటల్లో మార్పులు వచ్చాయన్నారు.

జీవవైవిధ్యంపై దృష్టి కేంద్రీకరించి, ఆహారపు అలవాట్లను మార్చి మానవ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ పోటీలు సాగాయి. ఇలాంటి పోటీలతో ప్రజల్లో మరింత అవగాహన పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

ఇవీ చూడండి: వడగాల్పులు మరో 5రోజులు..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.