ETV Bharat / state

బెంబేలెత్తిస్తున్న భానుడు

ఇంకా ఎండకాలం రాలేదు. కానీ భానుడు మాత్రం విరుచుకుపడుతున్నాడు. మార్చిలోనే ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ బెంబేలెత్తిస్తున్నాడు. ఇక ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.

author img

By

Published : Mar 12, 2019, 10:43 PM IST

ఇప్పుడే మండిపోతున్నాడు...!
ఇప్పుడే మండిపోతున్నాడు...!
రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు.
మార్చి నుంచే తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువ నమోదవుతూ... ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.

సాధాారణం కంటే ఎక్కువ...
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నిర్మల్ జిల్లా పెంబి, సంగారెడ్డి జిల్లా ఆల్మాయ్​పేట్, వనపర్తి జిల్లా ఆత్మకూర్​లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా కల్వచర్లలో 39.8, జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్​లో 39.7, నిజామాబాద్ జిల్లా బెల్లాల్​లో 39.6, నిర్మల్ జిల్లా వడ్యాల్​లో 39.6, రామగుండంలో 39.5, రాజోలిలో 39.5, సంగారెడ్డి జిల్లా అనంతసాగర్​లో 39.5 డిగ్రీ సెల్సియస్​గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాగల మూడు రోజులూ...
రాష్ట్రంలో రాగల మూడురోజులు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి:'సోషల్​ వేధింపుల'పై రాజకీయ కాక

ఇప్పుడే మండిపోతున్నాడు...!
రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు.మార్చి నుంచే తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువ నమోదవుతూ... ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు.

సాధాారణం కంటే ఎక్కువ...
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నిర్మల్ జిల్లా పెంబి, సంగారెడ్డి జిల్లా ఆల్మాయ్​పేట్, వనపర్తి జిల్లా ఆత్మకూర్​లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా కల్వచర్లలో 39.8, జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్​లో 39.7, నిజామాబాద్ జిల్లా బెల్లాల్​లో 39.6, నిర్మల్ జిల్లా వడ్యాల్​లో 39.6, రామగుండంలో 39.5, రాజోలిలో 39.5, సంగారెడ్డి జిల్లా అనంతసాగర్​లో 39.5 డిగ్రీ సెల్సియస్​గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాగల మూడు రోజులూ...
రాష్ట్రంలో రాగల మూడురోజులు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఇవీ చూడండి:'సోషల్​ వేధింపుల'పై రాజకీయ కాక

Note: Script Ftp

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.