ETV Bharat / state

పరీక్షలు మళ్లీ మళ్లీ వస్తాయి... జీవితం రాదుగా

మా పిల్లాడు ఈసారి ఎలాగైనా ఫస్ట్​ వస్తాడు అంటూ తల్లిదండ్రులు మురిసిపోతారు. వారి మాటలను నిలబెట్టుకోలేక చిన్నారులు సతమతమవుతున్నారు. పొరపాటున పరీక్షల్లో తప్పితే అంతే సంగతి. ఇక వాళ్లు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అసలు ఎందుకీ విద్యార్థుల ఆత్మహత్యలు?

author img

By

Published : Apr 19, 2019, 5:26 PM IST

Updated : Apr 19, 2019, 7:51 PM IST

పరీక్షలు మళ్లీ మళ్లీ వస్తాయి... జీవితం రాదుగా

ఓ వైపు కళాశాల యాజమాన్యాలు... మరోవైపు తల్లిదండ్రుల ఒత్తిడి... ఏదైతేనేం బలి అయ్యేది మాత్రం టీనేజీ విద్యార్థులు. ఉత్తీర్ణత సాధించకపోతే.. ఎందుకు పనికిరానట్టుగా సమాజం చూస్తోందని భయానికి గురై చిన్నారులు చితికిపోతున్నారు. పరీక్షల్లో ఫెయిల్​ అయితే... ఇక జీవితం దండగే అనుకుంటున్నారు. పరీక్షలు ప్రతి సంవత్సరం వస్తాయి... కానీ జీవితం ఒక్కసారి కొల్పోతే మళ్లీ తిరిగిరాదనే విషయాన్ని గ్రహించాలి.

పరీక్షలు మళ్లీ మళ్లీ వస్తాయి... జీవితం రాదుగా

అసలు ఎందుకిలా ఆలోచిస్తున్నారు?

పరీక్షల్లో తప్పితే.. ముందు ఇంట్లో వాళ్లు ఏం అంటారోనని భయం... అంతేనా బంధువులు, ఇంటి పక్కనవారు, స్నేహితులు చులకనగా చూస్తారని ఆందోళనకు గురవుతారు. అందుకే పరీక్షల్లో తప్పితే... ప్రాణాల్ని విడిచేందుకు వెనకాడడం లేదు.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

మీ పిల్లల్ని మార్కుల కోసం కాకుండా విజ్ఞానం కోసం చదివించండి. పరీక్షలు తప్పితే... ప్రోత్సహించాలి తప్ప... వారిని మందలించకండి. మార్చి పోతే సెప్టెంబర్​ ఉంటుందనే విషయాన్ని చెప్పండి. వాళ్లు ఇష్టంగా చదవడానికి మీరు ప్రేమగా చెప్పండి. వాళ్లు బాధపడితే ఓదార్చండి... ఏ సమస్య ఎదురైనా ఎదుర్కునేలా వారిలో ధైర్యాన్ని పెంచండి.

విద్యార్థులు గమనించాల్సింది!

పరీక్షలు తప్పినంత మాత్రన... ఎందుకు పనికిరాని వ్యక్తిగా భావించకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి తప్ప.. నిరాశ చెందకూడదు. ఈ పరీక్షలు తప్పినంతమాత్రాన జీవితం కోల్పోయినట్లు కాదని గుర్తించండి. గొప్పవారిలో అనేకమంది పరీక్షలు తప్పినవారు కూడా ఉన్నారని గుర్తు పెట్టుకోండి.

ఇదీ చూడండి: ఇంటర్​లో ఫెయిల్... విద్యార్థిని సూసైడ్..

ఓ వైపు కళాశాల యాజమాన్యాలు... మరోవైపు తల్లిదండ్రుల ఒత్తిడి... ఏదైతేనేం బలి అయ్యేది మాత్రం టీనేజీ విద్యార్థులు. ఉత్తీర్ణత సాధించకపోతే.. ఎందుకు పనికిరానట్టుగా సమాజం చూస్తోందని భయానికి గురై చిన్నారులు చితికిపోతున్నారు. పరీక్షల్లో ఫెయిల్​ అయితే... ఇక జీవితం దండగే అనుకుంటున్నారు. పరీక్షలు ప్రతి సంవత్సరం వస్తాయి... కానీ జీవితం ఒక్కసారి కొల్పోతే మళ్లీ తిరిగిరాదనే విషయాన్ని గ్రహించాలి.

పరీక్షలు మళ్లీ మళ్లీ వస్తాయి... జీవితం రాదుగా

అసలు ఎందుకిలా ఆలోచిస్తున్నారు?

పరీక్షల్లో తప్పితే.. ముందు ఇంట్లో వాళ్లు ఏం అంటారోనని భయం... అంతేనా బంధువులు, ఇంటి పక్కనవారు, స్నేహితులు చులకనగా చూస్తారని ఆందోళనకు గురవుతారు. అందుకే పరీక్షల్లో తప్పితే... ప్రాణాల్ని విడిచేందుకు వెనకాడడం లేదు.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

మీ పిల్లల్ని మార్కుల కోసం కాకుండా విజ్ఞానం కోసం చదివించండి. పరీక్షలు తప్పితే... ప్రోత్సహించాలి తప్ప... వారిని మందలించకండి. మార్చి పోతే సెప్టెంబర్​ ఉంటుందనే విషయాన్ని చెప్పండి. వాళ్లు ఇష్టంగా చదవడానికి మీరు ప్రేమగా చెప్పండి. వాళ్లు బాధపడితే ఓదార్చండి... ఏ సమస్య ఎదురైనా ఎదుర్కునేలా వారిలో ధైర్యాన్ని పెంచండి.

విద్యార్థులు గమనించాల్సింది!

పరీక్షలు తప్పినంత మాత్రన... ఎందుకు పనికిరాని వ్యక్తిగా భావించకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి తప్ప.. నిరాశ చెందకూడదు. ఈ పరీక్షలు తప్పినంతమాత్రాన జీవితం కోల్పోయినట్లు కాదని గుర్తించండి. గొప్పవారిలో అనేకమంది పరీక్షలు తప్పినవారు కూడా ఉన్నారని గుర్తు పెట్టుకోండి.

ఇదీ చూడండి: ఇంటర్​లో ఫెయిల్... విద్యార్థిని సూసైడ్..

Intro:అకాల వర్షం అన్నదాత ఇళ్లల్లో చీకటిని నింపింది....
చేతికి వచ్చిన పంట చేయి జారిందని రైతులు లబోదిబోమంటున్నారు ....






Body:
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోనీ మామిడి రైతుల గోస వర్ణనాతీతం.కాత కు వచ్చిన పంట నేలమట్టం అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలరాలిన కాయను మార్కెట్కు తీసుకెళ్తే ఆటో కిరాయి మందం కూడా రాక రైతులు నష్టపోతున్నారు. నిన్న కురిసిన వడగండ్ల వర్షం వల్ల ఒక రత్నవరం గ్రామంలోనే కాకుండా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా మామిడి రైతులదరిది ఇదే పరిస్థితి. పండ్ల తోటలను తీసేసి పోలాలుగా మార్చుకోవాలని రైతులు భావిస్తున్నారు.
( )


1బైట్::: ముసుకు వెంకటేశ్వర్లు, మామిడి రైతు....
నిన్న కురిసిన వర్షం వల్ల మామిడి పంటకు చాలా నష్టం జరిగింది. నేను 20 ఎకరాల మీద లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాను. పెట్టుబడి మందం కూడా వచ్చేటట్లు కనబడటం లేదు.మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము.


2 బైట్::::నాగయ్య, మామిడిరైతు......
ఈ అకాల వర్షాల వల్ల మామిడి తోటలు తీసేసి పంట పొలాలుగా చేయాలనిపిస్తుంది. ఇప్పటికే తోట పంటలు తక్కువగా ఉన్నప్పటికీ పండ్ల తోటలు తీసేసి పంట పొలాలుగా చేయాలని అధికమంది ఆలోచిస్తున్నారు. తోటలు వల్ల లాభం కంటే నష్టమే అధికమయి మార్కెట్లో సరైన విలువ రాక నష్టపోతున్నాం. కూలీ వారికి కూడా డబ్బు చెల్లించ లేకపోతున్నాను.


3 బైట్::::గురవయ్య....రైతు
30 ఎకరాల్లో మామిడి తోట కౌలుకు తీసుకున్నాను. దాదాపు రెండు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాను. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో రాదో అని ఆందోళన వ్యక్తమవుతోంది.కాయ మొత్తం రావాలి నష్టానికి గురయ్యాను.


4బైట్::::ఎల్లయ్య, మామిడిరైతు
నేను 25 లక్షల పెట్టుబడి పెట్టాను కనీసం 10 లక్షల అయినా చేతికి వచ్చే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది.మా సమస్యను అధికారులకు మరియు ప్రభుత్వం వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే లేక ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటికైనా మామిడి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.


5బైట్:::చిన్న రాములు, మామిడిరైతు
ప్రతి సంవత్సరం మామిడికాయ వ్యాపారం చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం 80 ఎకరాల మామిడి తోటలను కౌలుకు తీసుకున్నాను. 35 లక్షల పెట్టుబడి పెట్టాను. చెట్టు మీద సగం కంటే ఎక్కువ కాయ రాలిపోయింది.నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచడం లేదు.....







Conclusion:కెమెరా అండ్ రిపోర్టింగ్::::వాసు
సెంటర్:::కోదాడ
ఫోన్ నెంబర్:::9502802407
Last Updated : Apr 19, 2019, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.