తెలంగాణలోని 33 జిల్లాలలో క్రికెట్ను అభివృద్ధి పరచాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ను రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న గొడవలకు తక్షణమే ముగింపు పలికి ఆటను అభివృద్ధి చేయాలన్నారు. జిల్లాల్లో క్రికెట్ సంఘాలకు గుర్తిపు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించేలా తెలంగాణ జిల్లాల్లోని క్రికెటర్లను తీర్చిదిద్దాలని అజారుద్దీన్ను అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అవినీతిని పారద్రోలి, ప్రక్షాళన చేయాలని విన్నివించారు. 216 క్లబ్బులకు కూడా అఫిలియేషన్ ఇవ్వాలని.. అప్పుడే తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ జిల్లాల్లో కూడా ధోని, కపిల్ దేవ్ లాంటి క్రీడాకారులున్నారని.. అలాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని వెంకటేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించిన ప్రభుత్వం