ETV Bharat / state

ముషీరాబాద్​లో నిరాడంబరంగా సీతారాముల కల్యాణం

ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. కొన్ని చోట్ల వేడుకలకు భక్తులను ఆలయాల్లోకి అనుమతించకపోవడంతో.. వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.

author img

By

Published : Apr 21, 2021, 6:28 PM IST

sri rama navami in malkajgiri
ముషీరాబాద్​లో రామనవమి

కరోనా రెండో దశ ప్రభావంతో.. హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. అర్చకులు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. రాములోరి కల్యాణాన్ని నిర్వహించారు.

గాంధీనగర్, రామ్ నగర్, అడిక్మెట్, కవాడిగూడ, భోలక్​పూర్ డివిజన్లలోని పలు ఆలయాల్లో.. వేద పండితులు కొవిడ్​ నియమాలకు అనుగుణంగా కల్యాణాన్ని జరిపారు. చిక్కడపల్లి వివేక్ నగర్​లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో.. కేవలం బ్రాహ్మణులు, పాలక మండలి, పరిమిత సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. భక్తులను ఆలయాల్లోకి అనుమతించకపోవడంతో.. వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.

కరోనా రెండో దశ ప్రభావంతో.. హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. అర్చకులు కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. రాములోరి కల్యాణాన్ని నిర్వహించారు.

గాంధీనగర్, రామ్ నగర్, అడిక్మెట్, కవాడిగూడ, భోలక్​పూర్ డివిజన్లలోని పలు ఆలయాల్లో.. వేద పండితులు కొవిడ్​ నియమాలకు అనుగుణంగా కల్యాణాన్ని జరిపారు. చిక్కడపల్లి వివేక్ నగర్​లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో.. కేవలం బ్రాహ్మణులు, పాలక మండలి, పరిమిత సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. భక్తులను ఆలయాల్లోకి అనుమతించకపోవడంతో.. వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.

ఇదీ చదవండి: వేములవాడలో నిరాడంబరంగా జగదానంద కారకుడి కల్యాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.