హైదరాబాద్లో ఈ ఏడాది సదర్ ఉత్సవాలను ఎలాంటి ఆడంబరం లేకుండా నిర్వహిస్తున్నారు. కరోనా వల్ల భారీ ఎత్తున ఊరేగింపు చేపట్టే కార్యక్రమాలను రద్దు చేశారు. అయితే ఈ వేడుకల్లో ముషీరాబాద్కు చెందిన అఖిల భారత యాదవ సంఘం రాష్ట్రనాయకుడు ఎడ్ల హరిబాబు దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
హర్యానాలో 25 సార్లు ఛాంపియన్గా నిలిచిన దున్నరాజు నగరంలో జరిగే సదర్ ఉత్సవాలలో ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీని బరువు 1500 కేజీలు ఉంటుందని, ప్రతిరోజు 20 లీటర్లపాలు, ఎండుఫలాలు, ఆపిల్స్ ఆహారంగా ఇస్తామని వారు వెల్లడించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ముషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహించనున్నట్లు యాదవ సంఘం రాష్ట్రనాయకుడు వరుణ్ యాదవ్ పేర్కొన్నారు.