ETV Bharat / state

జనాభా లెక్కలపై కలెక్టర్​లతో ఎస్కే జోషి సమీక్ష - జనాభా లెక్కలపై కలెక్టర్​లతో ఎస్కే జోషి సమీక్ష

2021 జనాభా లెక్కలకు సంబంధించిన ముందస్తు పరీక్ష రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఆగస్టు12 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు జరగనుంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సూచించారు.

జనాభా లెక్కలపై కలెక్టర్​లతో ఎస్కే జోషి సమీక్ష
author img

By

Published : Jul 6, 2019, 5:28 AM IST

Updated : Jul 6, 2019, 7:44 AM IST

మహబూబ్​నగర్, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో జనాభా లెక్కలకు సంబంధించి ముందుస్తు పరీక్ష జరగనుందని... దీనిపై ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్​ సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని వేలేరు మండలం, మహబూబ్​నగర్ జిల్లాలోని నవాబ్ పేట్​, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రీటెస్ట్ నిర్వహిస్తున్నట్ల వెల్లడించారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

జనాభా లెక్కలపై కలెక్టర్​లతో ఎస్కే జోషి సమీక్ష
ఆలస్యం వద్దు:
2021 జనాభా లెక్కలకు సంబంధించి ఇప్పటికే నాలుగు ఉత్తర్వులు జారీచేశామని... 14 జిల్లాల్లోని 58 మండలాలకు సంబంధించిన కొన్ని గ్రామాలు, పట్టణాల వివరాలు నోటిఫికేషన్​లో గల్లంతయ్యాయని.. వీటి వివరాలను రెవెన్యూ శాఖ సేకరించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న రెవెన్యూ గ్రామాల వివరాలను 2011 మాస్టర్ డైరెక్టరీ, పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లిస్ట్, పంచాయతీ రాజ్ లిస్ట్, మాస్టర్ డెరెక్టరీ 2011 సెన్సెస్​లతో సరి పోల్చుకుని వివరాలు పంపాలని సూచించారు. ఇప్పటివరకు 589 మండలాలకు సంబంధించిన గ్రామ రిజిష్టర్లను 167 మంది తహసీల్దార్లు, 142 మున్సిపాలిటీలకు గానూ 30 పట్టాణాల రిజిష్టర్లు పంపారని తెలిపారు. పట్టణాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల వివరాలను కలెక్టర్లు వెంటనే పంపించాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: చివరి మ్యాచ్​లో పాకిస్థాన్ విజయం.. కానీ..!

మహబూబ్​నగర్, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో జనాభా లెక్కలకు సంబంధించి ముందుస్తు పరీక్ష జరగనుందని... దీనిపై ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్​ సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని వేలేరు మండలం, మహబూబ్​నగర్ జిల్లాలోని నవాబ్ పేట్​, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రీటెస్ట్ నిర్వహిస్తున్నట్ల వెల్లడించారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

జనాభా లెక్కలపై కలెక్టర్​లతో ఎస్కే జోషి సమీక్ష
ఆలస్యం వద్దు:
2021 జనాభా లెక్కలకు సంబంధించి ఇప్పటికే నాలుగు ఉత్తర్వులు జారీచేశామని... 14 జిల్లాల్లోని 58 మండలాలకు సంబంధించిన కొన్ని గ్రామాలు, పట్టణాల వివరాలు నోటిఫికేషన్​లో గల్లంతయ్యాయని.. వీటి వివరాలను రెవెన్యూ శాఖ సేకరించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న రెవెన్యూ గ్రామాల వివరాలను 2011 మాస్టర్ డైరెక్టరీ, పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లిస్ట్, పంచాయతీ రాజ్ లిస్ట్, మాస్టర్ డెరెక్టరీ 2011 సెన్సెస్​లతో సరి పోల్చుకుని వివరాలు పంపాలని సూచించారు. ఇప్పటివరకు 589 మండలాలకు సంబంధించిన గ్రామ రిజిష్టర్లను 167 మంది తహసీల్దార్లు, 142 మున్సిపాలిటీలకు గానూ 30 పట్టాణాల రిజిష్టర్లు పంపారని తెలిపారు. పట్టణాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల వివరాలను కలెక్టర్లు వెంటనే పంపించాలని ఆదేశించారు.

ఇవీ చూడండి: చివరి మ్యాచ్​లో పాకిస్థాన్ విజయం.. కానీ..!

TG_KRN_69_20_CS_JOSHI_PARYTANA_AVB_G7 ఆర్తి శ్రీకాంత్ ఈటీవీ కంట్రీబ్యూటర్ జగిత్యాల జిల్లా ధర్మపురి 9866562010 ========================================================================== యాంకర్: ముఖ్యమంత్రి పట్టుదల, నిరంతర శ్రమ ఫలితంగా మహద్బుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడంతో ప్రజల స్వప్నం సాకారమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని ప్యాకేజి 6 కింద నిర్మిస్తున్న పంప్ హౌజ్ , అండర్ టన్నేల్ పనులను సీఎస్ 12 బ్యాంకర్ల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. జిల్లాకు చేరిన బ్యాంకర్ల బృందాల ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు అనంతరం ప్యాకేజి 6 లో నిర్మించిన అండర్ టన్నెల్ పనులను, సర్జపూల్, పంప్ హౌజ్ పనులను బ్యాంకర్ల ప్రతినిధులు పరిశీలించారు. సీఎస్ మాట్లాడుతూ సీఎం ఉక్కు సంకల్పం వల్లే కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మాణం పూర్తయి, ప్రజలకు ఆ ఫలితాలను రికార్డు సమయంలో అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజేక్టులో 5 పాత రిజర్వాయర్లు, 19 నూతన రిజర్వాయర్లు, బ్యారేజిలు, పంప్ హౌజ్ లు, సుమారు 203 కిలో మీటర్ల సొరంగ మార్గాలు, విద్యుత్ సరఫరా చేయడానికి 17 సబ్ స్టేషన్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. పనులను ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయిన అనుమతులు కోసం సైతం సీఎం ప్రత్యేక ప్రణాళికరుపోందించి అమలు చేసారని, మహరాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వారి సహాకారం తీసుకొని అంతరాష్ట్ర వివాధాలు రాకుండా అతి తక్కువ ముంపుతో కూడిన ప్రాజేక్టుగా కాళేశ్వరంని సీఎం రూపొందించారని సీఎస్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజేక్టు ద్వారా ఈ సంవత్సరం ప్రజలకు తొలి ఫలితం అందించడం జరుగుతుందని సీఎస్ అన్నారు. నీటిపారుదల రంగం పై రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ది, పరిజ్ఞానం కారణంగానే భారీ ప్రాజేక్టు త్వరగా పూర్తయిందని సీఎస్ తెలిపారు. అనంతరం పవర్ కార్పోరేషన్ సీఎండి రాజీవ్ శర్మ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజేక్టు రుపొందించడానికి సీఎం కేసీఆర్ చాలా కృషి చేసారని, 1600 గంటలకు పైగా నిపుణులతో చర్చించి , అత్యాధునిక సాంకేతికను ఉపయోగించుకుంటూ లేడార్ సర్వే నిర్వహించి ఈ ప్రాజేక్టు నిర్మాణం చేపట్టారని, రైతులకు సాగు నీరు తప్పకుండా అందించాలనే దృడ సంకల్పంతో కేసీఆర్ ముందుకు సాగారని, ముఖ్యమంత్రి ఆలోచనలకనుగుణంగా రాష్ట్ర యంత్రాంగం, గుత్తేదార్లు పనిచేసి నాణ్యతతో కలిగిన ప్రాజేక్టును రికార్డు సమయంలో నిర్మించారని, దీని వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుందని, రైతులకు కరువు భాధలు తీరుతాయని, ప్రతి సంవత్సరం రెండు పంటలకు సాగు నీరందుతుందని, దేశానికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వేగం పాఠం అవుతుందని ఆయన తెలిపారు. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని, దీనికి రూపకర్త అయిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురొగతి పట్ల బ్యాంకర్లు సంతోషం వ్యక్తం చేసారు, ఇంత వేగంగా దేశంలో ఇప్పటి వరకు సాగునీటి ప్రాజేక్టు నిర్మాణం పూర్తి కాలేదని, ఈ ప్రాజేక్టు ద్వారా నీటి విడుదల చేసిన అనంతరం మంచి పంటలు పండడంతో పాటు ప్రజలకు తాగునీరు, రాష్ట్రంలో పరిశ్రమలకు సైతం నీటిని సరఫరా చేసి బృహత్తర ప్రాజేక్టు కాళేశ్వరమని, ఇటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం అయినందుకు బ్యాంకర్లుగా తమకు పూర్తి స్థాయిలో సంతృప్తి ఉందని, ప్రభుత్వానికి తదుపరి సైతం సహాయ సహాకారాలను తామ అందిస్తామని బ్యాంకర్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మాణం దేశానికి ఆదర్శమని బ్యాంకర్లు అందరు అభిప్రాయపడ్డారు. బైట్: హరీరామ్, నీటి పారుదల శాఖ ఈఎన్సీ
Last Updated : Jul 6, 2019, 7:44 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.