ETV Bharat / state

singareni: 'విదేశీ బొగ్గు దిగుమతి కంటే.. సింగరేణితో వాణిజ్య ఒప్పందం మేలు' - సింగరేణి వార్తలు

విదేశీ బొగ్గు దిగుమతుల కంటే దేశీయంగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్న సింగరేణితో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని సింగరేణి మార్కెటింగ్ జీఎం కె.రవిశంకర్ అన్నారు. హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో కర్ణాటకలోని బళ్లారి, హోస్పేటకు చెందిన 40 స్పాంజ్ ఐరన్ సంస్థల ప్రతినిధులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Singareni Cmd Review
Singareni Cmd Review
author img

By

Published : Aug 16, 2021, 9:16 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్​లో భాగంగా దేశీయ బొగ్గుకు మార్కెటింగ్ అవకాశాలను పెంచి, తద్వారా విదేశీ దిగుమతులు తగ్గించేందుకు కృషి జరుగుతోందని సింగరేణి మార్కెటింగ్ జీఎం కె.రవిశంకర్ తెలిపారు. ఇందులో భాగంగానే సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణి ద్వారా అదనంగా 2 మిలియన్ టన్నుల బొగ్గును నాన్ రెగ్యులేటెడ్ సంస్థలకు ఈ - వేలం లింకేజీ ద్వారా నోటిఫైడ్ ధరకే విక్రయించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇవాళ హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో కర్ణాటకలోని బళ్లారి, హోస్పేటకు చెందిన 40 స్పాంజ్ ఐరన్ సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఏవోఎల్​ విధానంతో పారదర్శకంగా..

కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశ పెట్టిన ఆక్షన్ ఆఫ్ లింకేజీ (AOL) విధానం ద్వారా పూర్తి పారదర్శకంగా బొగ్గు విక్రయాలను చేసేందుకు అవకాశం లభించిందన్నారు. ఈ పద్ధతి ద్వారా ఇప్పటికే 6 సార్లు సింగరేణి వేలం నిర్వహించి సిమెంట్, క్యాప్టివ్ పవర్, స్పాంజ్ ఐరన్, పేపర్, ఫార్మా డ్రగ్స్, తదితర సంస్థలకు 10.8 మిలియన్ టన్నుల బొగ్గును లింకేజీ చేసిందని వివరించారు. ఏడోసారి అదనంగా 2 మిలియన్ టన్నులకు నిర్వహిస్తున్న ఈ- వేలం నిర్వహణ విధానం, సింగరేణి బొగ్గు నాణ్యత తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు స్పాంజ్ ఐరన్ సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సింగరేణి కో-ఆర్డినేషన్ జీఎం కె.సూర్యనారాయణ తెలిపారు. సింగరేణిలో జీ-5 గ్రేడ్ బొగ్గు కూడా అందుబాటులో ఉందన్నారు.

సింగరేణి గురించి తెలియకపోవడం వల్ల..

కర్ణాటకలో పలు సంస్థలు సింగరేణి బొగ్గు గురించి పూర్తి వివరాలు తెలియక పోవడం వల్ల విదేశీ బొగ్గుపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించామన్నారు. విదేశీ బొగ్గుతో పోల్చుకుంటే సింగరేణి బొగ్గు వినియోగం, సింగరేణితో ఒప్పందం వల్ల కలిగే అదనపు ప్రయోజనాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఒకవేళ సంస్థలతో ఒప్పందం జరిగితే వచ్చే ఐదేళ్ల వరకు ఉన్న మార్కెటింగ్ అవకాశాలతో పాటు అదనంగా 2 మిలియన్ టన్నులకు అవకాశం ఏర్పడనుందన్నారు.

ఇదీ చూడండి: Singareni: సింగరేణిని అభినందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్​లో భాగంగా దేశీయ బొగ్గుకు మార్కెటింగ్ అవకాశాలను పెంచి, తద్వారా విదేశీ దిగుమతులు తగ్గించేందుకు కృషి జరుగుతోందని సింగరేణి మార్కెటింగ్ జీఎం కె.రవిశంకర్ తెలిపారు. ఇందులో భాగంగానే సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణి ద్వారా అదనంగా 2 మిలియన్ టన్నుల బొగ్గును నాన్ రెగ్యులేటెడ్ సంస్థలకు ఈ - వేలం లింకేజీ ద్వారా నోటిఫైడ్ ధరకే విక్రయించేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇవాళ హైదరాబాద్​లోని సింగరేణి భవన్​లో కర్ణాటకలోని బళ్లారి, హోస్పేటకు చెందిన 40 స్పాంజ్ ఐరన్ సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఏవోఎల్​ విధానంతో పారదర్శకంగా..

కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశ పెట్టిన ఆక్షన్ ఆఫ్ లింకేజీ (AOL) విధానం ద్వారా పూర్తి పారదర్శకంగా బొగ్గు విక్రయాలను చేసేందుకు అవకాశం లభించిందన్నారు. ఈ పద్ధతి ద్వారా ఇప్పటికే 6 సార్లు సింగరేణి వేలం నిర్వహించి సిమెంట్, క్యాప్టివ్ పవర్, స్పాంజ్ ఐరన్, పేపర్, ఫార్మా డ్రగ్స్, తదితర సంస్థలకు 10.8 మిలియన్ టన్నుల బొగ్గును లింకేజీ చేసిందని వివరించారు. ఏడోసారి అదనంగా 2 మిలియన్ టన్నులకు నిర్వహిస్తున్న ఈ- వేలం నిర్వహణ విధానం, సింగరేణి బొగ్గు నాణ్యత తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు స్పాంజ్ ఐరన్ సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సింగరేణి కో-ఆర్డినేషన్ జీఎం కె.సూర్యనారాయణ తెలిపారు. సింగరేణిలో జీ-5 గ్రేడ్ బొగ్గు కూడా అందుబాటులో ఉందన్నారు.

సింగరేణి గురించి తెలియకపోవడం వల్ల..

కర్ణాటకలో పలు సంస్థలు సింగరేణి బొగ్గు గురించి పూర్తి వివరాలు తెలియక పోవడం వల్ల విదేశీ బొగ్గుపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించామన్నారు. విదేశీ బొగ్గుతో పోల్చుకుంటే సింగరేణి బొగ్గు వినియోగం, సింగరేణితో ఒప్పందం వల్ల కలిగే అదనపు ప్రయోజనాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఒకవేళ సంస్థలతో ఒప్పందం జరిగితే వచ్చే ఐదేళ్ల వరకు ఉన్న మార్కెటింగ్ అవకాశాలతో పాటు అదనంగా 2 మిలియన్ టన్నులకు అవకాశం ఏర్పడనుందన్నారు.

ఇదీ చూడండి: Singareni: సింగరేణిని అభినందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.