హైదరాబాద్ గచ్చిబౌలిలోని సన్ షైన్ హాస్పిటల్ మెరుగైన సేవలు అందించడంలో ముందుంటుందని, ఇటీవల ఏర్పాటు చేసిన "స్టేట్ అఫ్ ది ఆర్ట్" పల్మొనరీ ఫంక్షన్ ల్యాబ్ దేశంలోనే మొదటిదని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం కొత్తగా నెలకొల్పిన ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఈ పరికరం శాస్రీయ పద్ధతిలో శారీర సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తుందని, క్రీడాకారులకు ఫిట్నెస్ పరీక్ష చేసుకొని సామర్థ్యం పెంచుకోవడానికి దోహదపడుతుందన్నారు. శరీరంలోని అవయవాల పనితీరును ఈ పరికరం తెలియజేస్తుందని సన్షైన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గురువా రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి : వరినాట్లు వేసిన కలెక్టర్ భారతి హోళీకేరి