SBI Ladies Club Donation: అనాథ పిల్లలను సంరక్షించడంలో గోపన్పల్లిలోని శిశు మంగళ్ అనాథాశ్రమం చేస్తున్న కృషిని ఆల్ ఇండియా ఎస్బీఐ లేడిస్ క్లబ్ అధ్యక్షురాలు అనితా ఖారా అభినందించారు. రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని ఆనాథాశ్రమాన్ని అనితా ఖారాతో పాటు తెలంగాణ రాష్ట్ర లేడిస్ క్లబ్ అధ్యక్షురాలు నుపుర్ ఝింగ్రాన్ సందర్శించారు. అనాథాశ్రమంలోని 27మంది బాలికలు, 15 మంది బాలుర గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు యోగా కూడా నేర్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ అనాథాశ్రమానికి ఎస్బీఐ లేడిస్ క్లబ్ తరఫున రూ.5 లక్షల విలువచేసే బియ్యం, బట్టలు, సైకిళ్లు, స్వెటర్లు, యోగా మ్యాట్స్, ఆల్మార్స్, కార్పెట్లు, దుప్పట్లు, స్మార్ట్ ఫోన్లు, స్టేషనరీ అందజేశారు. ఎన్జీవో అందించే సౌకర్యాలను వినియోగించుకోవాలని అనితా ఖారా కోరారు.
ఇదీ చదవండి: Good news for drinkers: మద్యం ప్రియులకు శుభవార్త.. అర్ధరాత్రి వరకు అమ్మకాలు