శిశు మందిర్ పూర్వ విద్యార్థుల, ఆచార్యులతో ఈ నెల 29న శ్రీ శారదాధామం బండ్లగూడలో మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు విద్యాపీఠం పాలక మండలి సభ్యులు అన్నదానం సుబ్రహ్మణ్యం తెలిపారు. 10 వేల మంది పూర్వ విద్యార్థులు, వెయ్యి మంది పూర్వ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్య అతిథిగా ఆరెస్సెస్ అధినేత డాక్టర్ మోహన్ భగవత్ హాజరై... మార్గదర్శనం చేయనున్నరని తెలిపారు.
దేశంలోని అనేక విద్యా సంస్థలకు, పూర్వ విద్యార్థులకు ఆలోచనను కలిగించేందుకు ఈ సమ్మేళనం తోడ్పడుతోందని పేర్కొన్నారు. విద్యార్థి శక్తి వృథా కాకుండా, సమాజాభివృద్ధికి కృషి చేసేలా భాగస్వాములను చేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి