ప్రతి వ్యక్తి ధర్మాన్ని కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని శ్రీ శక్తి పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. హైదరాబాద్ రామంతపూర్లోని భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ నివాసంలో జరిగిన సహస్ర కోటి లలిత పారాయణంలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి ప్రవచనాలు చెప్పారు.
పూజలు చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయనుకోవద్దని.. లలిత సహస్ర కోటి పారాయణం చేస్తే ఎలాంటి అశాంతి బాధలు దరిచేరవని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. అమ్మవారి కోటి లలితా పారాయణం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని సూచించారు.
ఇవీ చూడండి: న్యాయస్థానికి దేవుడు: సుప్రీంలో పిటిషనర్గా చిలుకూరు బాలాజీ