బంజారాహిల్స్లోని మెరిడియన్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని తన దాతృత్వాన్ని చాటుకుంది. చిత్రలేఖనం ద్వారా సంపాదించిన నగదును సైబరాబాద్ పోలీసులకు విరాళంగా ఇచ్చింది. ఆపరేషన్ స్మైల్లో భాగంగా అనాథ పిల్లలకు సైబరాబాద్ పోలీసులు అందిస్తున్న తోడ్పాటుకు అలేఖ్య తన వంతుగా 87వేల రూపాయలను అందించింది.
సైబరాబాద్ సీపీ సజ్జనార్కు ఈ నగదును నేరుగా అందించారు. ఆపరేషన్ స్మైల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు వీధి బాలలు, బాల కార్మికులు, అనాథ పిల్లలను చేరదీసి.. వాళ్లకు స్వచ్ఛంద సంస్థల సాయంతో విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలేఖ్య దాతృత్వాన్ని సీపీ ప్రశంసించారు.
ఇదీ చూడండి: 'జైలు నుంచి విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నాం'