ETV Bharat / state

Revanth Reddy Letter To Farmers : 'రైతువేదికలపై రాజకీయాలు చేసేందుకు సిద్ధమైన బీఆర్​ఎస్ సర్కార్‌ను నిలదీయాలి'

author img

By

Published : Jul 16, 2023, 3:33 PM IST

Revanth Reddy fires on BRS : రైతు వేదికలపై రాజకీయాలు చేసేందుకు సిద్ధమైన బీఆర్​ఎస్ సర్కార్‌ను నిలదీయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రుణమాఫీ అమలు, ధాన్యం డబ్బుల బకాయిలు, పోడుభూముల పట్టాల అంశాలపై నేతలను ఎక్కడికక్కడ ప్రశ్నించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రైతులకు బహిరంగ లేఖ రాసిన రేవంత్‌రెడ్డి.. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీఆర్​ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు.

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy letter to Telangana farmers : రైతు వేదికల సాక్షిగా పోరాటానికి సిద్ధమైన బీఆర్​ఎస్ కార్యాచరణకు కాంగ్రెస్‌ ఎదురుదాడి వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇదే రైతు వేదికలపై బీఆర్​ఎస్ ప్రభుత్వ రైతు వేదిక విధానాలపై నేతల్ని నిలదీయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు బహిరంగ లేఖ రాశారు. రైతు వేదికలను ఇన్నాళ్లూ అలంకార ప్రాయంగా ఉంచిన ఆ పార్టీ.. ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చేందుకు బరి తెగించిందని మండిపడ్డారు.

రైతు రుణమాఫీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశామని.. చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం అయిపోయిందని తెలిపారు. రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టత వచ్చేసిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలు ఉండగా రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన మన సహచరులు దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని పేర్కొన్నారు.

Revanth Reddy fires on KCR : ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. జూన్ 15 నాటికి రూ.6 వేల 800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుంచి ప్రభుత్వం లాక్కుందని పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రాలేదని మండిపడ్డారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్​ ప్రభుత్వం హడావిడి మొదలు పెట్టిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలగా.. నాలుగు లక్షల మందికే పట్టాలు ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. రైతులకు ఎరువులు ఫ్రీగా ఇస్తామని రాష్ట్రప్రభుత్వం మోసం చేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదని లేఖలో పునరుద్ఘాటించారు.

విద్యుత్‌ సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ లే దీనికి సాక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని తెలిపారు. దీని నుంచి తప్పించుకునేందుకు అన్ని సబ్ స్టేషన్లలో లాగ్ బుక్​లను వెనక్కు తెప్పించుకుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్​ది ఆల్ టైం రికార్డు అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి బీఆర్​ఎస్ నేతలు వస్తున్నారని.. ఆ రైతు ద్రోహులకు బుద్ధి చెప్పడానికి ఇదొక సదవకాశమని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో సమస్యలపై నిలదేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో? ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో? పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించాలని రైతులను కోరారు.

ఇవీ చదవండి:

Revanth Reddy letter to Telangana farmers : రైతు వేదికల సాక్షిగా పోరాటానికి సిద్ధమైన బీఆర్​ఎస్ కార్యాచరణకు కాంగ్రెస్‌ ఎదురుదాడి వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇదే రైతు వేదికలపై బీఆర్​ఎస్ ప్రభుత్వ రైతు వేదిక విధానాలపై నేతల్ని నిలదీయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు బహిరంగ లేఖ రాశారు. రైతు వేదికలను ఇన్నాళ్లూ అలంకార ప్రాయంగా ఉంచిన ఆ పార్టీ.. ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చేందుకు బరి తెగించిందని మండిపడ్డారు.

రైతు రుణమాఫీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశామని.. చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం అయిపోయిందని తెలిపారు. రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టత వచ్చేసిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలు ఉండగా రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన మన సహచరులు దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని పేర్కొన్నారు.

Revanth Reddy fires on KCR : ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. జూన్ 15 నాటికి రూ.6 వేల 800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుంచి ప్రభుత్వం లాక్కుందని పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రాలేదని మండిపడ్డారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్​ ప్రభుత్వం హడావిడి మొదలు పెట్టిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలగా.. నాలుగు లక్షల మందికే పట్టాలు ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. రైతులకు ఎరువులు ఫ్రీగా ఇస్తామని రాష్ట్రప్రభుత్వం మోసం చేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదని లేఖలో పునరుద్ఘాటించారు.

విద్యుత్‌ సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ లే దీనికి సాక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని తెలిపారు. దీని నుంచి తప్పించుకునేందుకు అన్ని సబ్ స్టేషన్లలో లాగ్ బుక్​లను వెనక్కు తెప్పించుకుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్​ది ఆల్ టైం రికార్డు అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి బీఆర్​ఎస్ నేతలు వస్తున్నారని.. ఆ రైతు ద్రోహులకు బుద్ధి చెప్పడానికి ఇదొక సదవకాశమని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో సమస్యలపై నిలదేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో? ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో? పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించాలని రైతులను కోరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.