కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అవిశ్రాంతిగా పనిచేస్తున్న పోలీసులకు సేవా భారతి స్వచ్ఛంద సంస్థ రక్షణ పరికరాలు పంపిణీ చేసింది. సంస్థ అధినేత భారతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రతి పోలీస్ స్టేషన్లో మాస్కులు, శానిటైజర్లు అందించారు.
పురానాపుల్లోని పోలీస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న 200 మంది సివిల్ కానిస్టేబుల్స్కు మాస్క్లు, శానిటైజర్లు అందజేశారు. ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి