ETV Bharat / state

రోడ్డెక్కని ఆర్టీసీ అద్దె బస్సులు... యాజమానుల్లో ఆందోళన

author img

By

Published : Jul 27, 2020, 7:27 PM IST

కరోనా ప్రభావంతో 30శాతం బస్సులు తిరిగేందుకే ప్రభుత్వం అనుమతించింది. ఈ కారణంగా ఏపీఎస్ఆ​ర్టీసీ అద్దె బస్సులు ఇంకా రోడ్డెక్కేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏపీ కడప జిల్లాలో 290 బస్సులుండగా అవన్నీ మూలనపడ్డాయి. బస్సుల మీదే ఆధారపడి జీవిస్తున్నామని... అద్దె బస్సులను తిప్పేందుకు అనుమతివ్వాలని యజమానులు వేడుకుంటున్నారు.

rental-bus-owners-situation-in-kadapa-district
రోడ్డెక్కని ఏపీఎస్​ఆర్టీసీ అద్దె బస్సులు... యాజమానుల్లో ఆందోళన

కరోనా మహమ్మారితో ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లాలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా ఏపీఎస్ఆ​ర్టీ అద్దె బస్సుల పరిస్థితి దారుణంగా మారింది. ఐదు నెలల నుంచి బస్సులను బయటికి తీయలేదు. లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి బస్సులను నిలిపేశారు.

కానీ మే 21 నుంచి తిరిగి ఏపీఎస్ఆ​ర్టీ బస్ సర్వీసులను ప్రారంభించినా అద్దె బస్సులు మాత్రం రోడ్డు ఎక్క లేదు. ఈ కారణంగా జిల్లాలోని 290 అద్దె బస్సులు ఖాళీగా ఉంటున్నాయి. వాహనాలపైనే ఆధారపడి జీవిస్తున్నామని... అద్దె బస్సులను సైతం నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు.

ఇవీ చూడండి-వైఎస్ వివేకా హత్య కేసు.. అనుమానితుల జాబితాలో 15 మంది!

కరోనా మహమ్మారితో ఆంధ్రప్రదేశ్​ కడప జిల్లాలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా ఏపీఎస్ఆ​ర్టీ అద్దె బస్సుల పరిస్థితి దారుణంగా మారింది. ఐదు నెలల నుంచి బస్సులను బయటికి తీయలేదు. లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి బస్సులను నిలిపేశారు.

కానీ మే 21 నుంచి తిరిగి ఏపీఎస్ఆ​ర్టీ బస్ సర్వీసులను ప్రారంభించినా అద్దె బస్సులు మాత్రం రోడ్డు ఎక్క లేదు. ఈ కారణంగా జిల్లాలోని 290 అద్దె బస్సులు ఖాళీగా ఉంటున్నాయి. వాహనాలపైనే ఆధారపడి జీవిస్తున్నామని... అద్దె బస్సులను సైతం నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు.

ఇవీ చూడండి-వైఎస్ వివేకా హత్య కేసు.. అనుమానితుల జాబితాలో 15 మంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.