హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శాస్త్రవేత్త సూరి భగవంతం 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రక్షణరంగ పరిశోధన అభివృద్ధి శాఖ కార్యదర్శి జీ.సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం డీఆర్డీవో విస్తరణలో సూరి భగవంతం ముఖ్య భూమిక పోషించారని ఆయన సేవలను గుర్తు చేశారు. అలాగే రక్షణ రంగంలో చేయాల్సిన పరిశోధనల గురించి ఆయన పనిచేసిన సంస్థల అభ్యున్నతికి విశేష కృషి చేశారని సతీష్ రెడ్డి కొనియాడారు. ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ, సూరి భగవంతం మెమోరియల్ కమిటీ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డిని అబ్దుల్ కలాం స్మారక అవార్డుతో సత్కరించారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ బస్సు బీభత్సం... మద్యం మత్తులో డ్రైవర్!