ETV Bharat / state

ఓటు వేయడానికి ఫ్రీగా ర్యాపిడో బుక్​ చేసేయ్​ - ఓటింగ్​ శాతాన్ని పెంచేయ్​

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 6:36 AM IST

Updated : Nov 30, 2023, 7:18 AM IST

Rapido Free Rides on Election Polling Day in Hyderabad : ఈ శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్​ శాతాన్ని పెంచేందుకు ర్యాపిడో బైక్​ ట్యాక్సీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఎప్పుడు ఎన్నిక జరిగిన 55 శాతాన్ని దాటని.. హైదరాబాద్​లో ఓటింగ్​ శాతాన్ని ముందుకు జరిపేందుకు ఈ పని చేస్తున్నారు. ఓటు వేసేందుకు వెళితే ఫ్రీగా ర్యాపిడో వారే బైక్​పై మిమ్మల్ని అక్కడకు చేరవేస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ముందుగా ఓటేయాలనుకుంటే ర్యాపిడో బుక్​ చేసేయ్​!

Rapido Free Rides
Rapido Free Rides on Election Polling Day in Hyderabad

Rapido Free Rides on Election Polling Day in Hyderabad : ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​(Election Polling) జరుగుతోంది. అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం పోలింగ్​ జరిగితే.. హైదరాబాద్​లో మాత్రం 55 శాతానికి మించడం లేదు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్​గా తీసుకోకపోయిన బైక్​ ట్యాక్సీలో అగ్రగామి సంస్థ ర్యాపిడో(Rapido) మాత్రం సీరియస్​గా తీసుకుంది. అందుకు వినూత్నంగా రైడ్​ షేరింగ్​ అనే వినూత్న కార్యక్రమం చేపట్టనుంది.

ఈ శాసనసభ ఎన్నికలో పోలింగ్​ రోజున ర్యాపిడో సంస్థ 2,600 పోలింగ్​ బూత్​లకు ఉచిత రైడ్​లను అందిస్తూ.. రైడ్​ షేరింగ్(Ride Sharing)​ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక ప్రకటన రూపంలో విడుదల చేసింది. గ్రేటర్​ హైదరాబాద్​లో పోలింగ్​ శాతాన్ని పెంచేందుకు ఈ వినూత్న పోగ్రాంకు సిద్ధమైనట్లు ర్యాపిడో సంస్థ తెలిపింది. అయితే ర్యాపిడో కెప్టెన్లంతా ఈ నెల 30న ఉదయం నుంచే రైడ్​లకు సిద్ధంగా ఉంటారని ఆ సంస్థ పేర్కొంది. ఓటు వేయాలనే ఓటర్లు (Voters) ర్యాపిడో యాప్​లో రైడ్​ కోరిన వెంటనే వారిని పోలింగ్​ బూత్​ల వద్దకు ఉచితంగా బైక్​ మీద తీసుకువెళ్లనున్నారు.

'ఎన్నికలు అయిపోయే వరకు మీరే కాస్త సర్దుకోండమ్మా - ప్రచారాలు ముగియగానే మళ్లీ వచ్చి పనిలో చేరిపోతాం'

Rapido Bike Taxi Free Rides : ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్న మనదేశంలో ప్రతి ఓటు(Vote) కీలకమే అని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్​ గుంటుపల్లి అన్నారు. ఓటుహక్కు అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించాలని అది మనకు మన రాజ్యాంగం అందించిన గొప్ప హక్కు అని చెప్పారు. ఈ ఓటుతోనే మనకు నచ్చిన, సుపరిపాలన అందిస్తున్న నాయకుడిని ఎన్నుకోవచ్చన్నారు. అందుకే రవాణా గురించి చింతించకుండా ప్రజలు సౌకర్యవంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ చిన్న ప్రయత్నం గ్రేటర్​లో ఓటింగ్​ శాతాన్ని పెంచుతుందనే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే పోలింగ్​ జరిగే ఈరోజు ఉచిత రైడ్లు అందిస్తున్నట్లు వివరించారు. ఈ సేవలను ప్రతిఒక్క ఓటరు ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ ఉచిత రైడ్​ పొందడం ఎలా..

  • ముందుగా ర్యాపిడో బైక్​ ట్యాక్సీ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • అప్పుడు యాప్​ లాగిన్​ అయిన తర్వాత ఉచిత రైడ్​ సేవలపై వివరాలు ప్రత్యక్షమవుతాయి.
  • ఉచిత రైడ్​ సేవలలో పోలింగ్​ బూత్​ ఎక్కడుందో టైప్​ చేయాలి.
  • అనంతరం కూపన్​ కోడ్​ వస్తుంది.
  • కూపన్​ కోడ్​ ఉన్న చోట వోట్​ నౌ అనే వన్​ టైమ్​ కోడ్​ను నమోదు చేయాలి.
  • ఇలా చేస్తే ఆ తర్వాత ఉచిత రైడ్​ బుక్​ అవుతుంది. దీంతో పోలింగ్​లో ఓటు వేయడానికి ముందుగానే వెళ్లవచ్చు.

అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన మైనార్టీల ఓట్లు - దక్కేదెవరికో మరి?

తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న స్టార్‌ క్యాంపెయినర్లు - అభ్యర్థులకు ఎంతవరకు కలిసొచ్చేనో?

Rapido Free Rides on Election Polling Day in Hyderabad : ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​(Election Polling) జరుగుతోంది. అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం పోలింగ్​ జరిగితే.. హైదరాబాద్​లో మాత్రం 55 శాతానికి మించడం లేదు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం సీరియస్​గా తీసుకోకపోయిన బైక్​ ట్యాక్సీలో అగ్రగామి సంస్థ ర్యాపిడో(Rapido) మాత్రం సీరియస్​గా తీసుకుంది. అందుకు వినూత్నంగా రైడ్​ షేరింగ్​ అనే వినూత్న కార్యక్రమం చేపట్టనుంది.

ఈ శాసనసభ ఎన్నికలో పోలింగ్​ రోజున ర్యాపిడో సంస్థ 2,600 పోలింగ్​ బూత్​లకు ఉచిత రైడ్​లను అందిస్తూ.. రైడ్​ షేరింగ్(Ride Sharing)​ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక ప్రకటన రూపంలో విడుదల చేసింది. గ్రేటర్​ హైదరాబాద్​లో పోలింగ్​ శాతాన్ని పెంచేందుకు ఈ వినూత్న పోగ్రాంకు సిద్ధమైనట్లు ర్యాపిడో సంస్థ తెలిపింది. అయితే ర్యాపిడో కెప్టెన్లంతా ఈ నెల 30న ఉదయం నుంచే రైడ్​లకు సిద్ధంగా ఉంటారని ఆ సంస్థ పేర్కొంది. ఓటు వేయాలనే ఓటర్లు (Voters) ర్యాపిడో యాప్​లో రైడ్​ కోరిన వెంటనే వారిని పోలింగ్​ బూత్​ల వద్దకు ఉచితంగా బైక్​ మీద తీసుకువెళ్లనున్నారు.

'ఎన్నికలు అయిపోయే వరకు మీరే కాస్త సర్దుకోండమ్మా - ప్రచారాలు ముగియగానే మళ్లీ వచ్చి పనిలో చేరిపోతాం'

Rapido Bike Taxi Free Rides : ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తున్న మనదేశంలో ప్రతి ఓటు(Vote) కీలకమే అని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్​ గుంటుపల్లి అన్నారు. ఓటుహక్కు అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించాలని అది మనకు మన రాజ్యాంగం అందించిన గొప్ప హక్కు అని చెప్పారు. ఈ ఓటుతోనే మనకు నచ్చిన, సుపరిపాలన అందిస్తున్న నాయకుడిని ఎన్నుకోవచ్చన్నారు. అందుకే రవాణా గురించి చింతించకుండా ప్రజలు సౌకర్యవంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ చిన్న ప్రయత్నం గ్రేటర్​లో ఓటింగ్​ శాతాన్ని పెంచుతుందనే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే పోలింగ్​ జరిగే ఈరోజు ఉచిత రైడ్లు అందిస్తున్నట్లు వివరించారు. ఈ సేవలను ప్రతిఒక్క ఓటరు ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ ఉచిత రైడ్​ పొందడం ఎలా..

  • ముందుగా ర్యాపిడో బైక్​ ట్యాక్సీ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • అప్పుడు యాప్​ లాగిన్​ అయిన తర్వాత ఉచిత రైడ్​ సేవలపై వివరాలు ప్రత్యక్షమవుతాయి.
  • ఉచిత రైడ్​ సేవలలో పోలింగ్​ బూత్​ ఎక్కడుందో టైప్​ చేయాలి.
  • అనంతరం కూపన్​ కోడ్​ వస్తుంది.
  • కూపన్​ కోడ్​ ఉన్న చోట వోట్​ నౌ అనే వన్​ టైమ్​ కోడ్​ను నమోదు చేయాలి.
  • ఇలా చేస్తే ఆ తర్వాత ఉచిత రైడ్​ బుక్​ అవుతుంది. దీంతో పోలింగ్​లో ఓటు వేయడానికి ముందుగానే వెళ్లవచ్చు.

అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన మైనార్టీల ఓట్లు - దక్కేదెవరికో మరి?

తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న స్టార్‌ క్యాంపెయినర్లు - అభ్యర్థులకు ఎంతవరకు కలిసొచ్చేనో?

Last Updated : Nov 30, 2023, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.