ETV Bharat / state

'తెలుగుభాషను కాపాడటం అందరి బాధ్యత' - Hyderabad Domalaguda Indirapark

హైదరాబాద్​ దోమలగూడ ఇందిరాపార్క్​ వద్ద గల హైదరాబాద్‌ స్టడీ సర్కిల్​లో తెలుగు భాషా కూటమి సమావేశం నిర్వహించారు. మాతృభాష ఉద్యమానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. తెలుగును కాపాడుకోవడం అందరి బాధ్యతని సమావేశంలో పాల్గొన్న వక్తలు తెలిపారు.

Kodanda Ramayya
Kodanda Ramayya
author img

By

Published : Feb 23, 2020, 11:24 AM IST

తెలుగు భాషకు ప్రమాదమేర్పడుతుందని.... మన మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని తెలుగు భాషా కూటమి అభిప్రాయపడింది. హైదరాబాద్​లోని దోమలగూడ ఇందిరాపార్క్​ వద్ద గల హైదరాబాద్‌ స్టడీ సర్కిల్​లో తెలుగు భాషా కూటమి సమావేశం ఏర్పాటు చేసి... భాషోద్యమానికి తీసుకోవాల్సిన కార్యచరణపై చర్చించారు.

భాషను కాపాడుకోకపోతే... భాషతో పాటు మన సంస్కృతి, కళలు, చరిత్ర, విజ్ఞానం, జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని సమావేశంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. భాషాభిమానం ఉన్నవారు మాటలకే పరిమితం కాకుండా... చేతలు చూపించాలని కోరారు. పిల్లలు మాతృభాషను మర్చిపోకుండా చూసే బాధ్యత వారి తల్లిదండ్రుల పైనే ఉందన్నారు. ఇతర భాషలు నేర్చుకున్నా... మాతృభాషను మర్చిపోవద్దని సూచించారు.

తెలుగుభాషను కాపాడటం అందరి బాధ్యత

ఇవీ చూడండి: కొత్త జీహెచ్​ఎంసీ చట్టంపై మంత్రి కేటీఆర్ సమీక్ష

తెలుగు భాషకు ప్రమాదమేర్పడుతుందని.... మన మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని తెలుగు భాషా కూటమి అభిప్రాయపడింది. హైదరాబాద్​లోని దోమలగూడ ఇందిరాపార్క్​ వద్ద గల హైదరాబాద్‌ స్టడీ సర్కిల్​లో తెలుగు భాషా కూటమి సమావేశం ఏర్పాటు చేసి... భాషోద్యమానికి తీసుకోవాల్సిన కార్యచరణపై చర్చించారు.

భాషను కాపాడుకోకపోతే... భాషతో పాటు మన సంస్కృతి, కళలు, చరిత్ర, విజ్ఞానం, జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని సమావేశంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. భాషాభిమానం ఉన్నవారు మాటలకే పరిమితం కాకుండా... చేతలు చూపించాలని కోరారు. పిల్లలు మాతృభాషను మర్చిపోకుండా చూసే బాధ్యత వారి తల్లిదండ్రుల పైనే ఉందన్నారు. ఇతర భాషలు నేర్చుకున్నా... మాతృభాషను మర్చిపోవద్దని సూచించారు.

తెలుగుభాషను కాపాడటం అందరి బాధ్యత

ఇవీ చూడండి: కొత్త జీహెచ్​ఎంసీ చట్టంపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.