ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ పీ లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి మహాత్మగాంధీ యూనివర్సిటీ వీసీగా నియమితులు కావటంతో.. ఆ స్థానంలో మెకానికల్ విభాగానికి చెందిన లక్ష్మీనారాయణను నియమించారు.
ఉపకులపతి ఓఎస్డీగా జంతుశాస్త్రం విభాగం ప్రొఫెసర్ రెడ్యానాయక్ నియమితులయ్యారు. అకడమిక్ ఆడిట్ విభాగం డైరెక్టర్గా కె.శ్యామల, సంయుక్త డైరెక్టర్గా ఎం.రాములును నియమిస్తూ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ సి.గణేష్, సికింద్రాబాద్ పీజీ కాలేజీ ప్రిన్సిపల్గా ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ బి.సుధాకర్ రెడ్డి, నిజాం కాలేజీ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ బి.నారాయణను నియమిస్తూ ఓయూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: 'మానుకోట తిరుగుబాటు.. సమైక్యాంధ్రుల మీద సాధించిన గొప్ప విజయం'