ETV Bharat / state

కరోనా బాధితుల కోసం హోం ఐసోలేషన్​ ప్యాకేజీలు - telangana news 2021

కరోనా రోజురోజుకూ తన ఉగ్రరూపాన్ని చూపెడుతోంది. వైరస్​ బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్పల్ప లక్షణాలున్నా బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు దాదాపు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఆసుపత్రులు హోం ఐసోలేషన్​ ప్యాకేజీ పేరిట రోగులకు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఆన్​లైన్​ ద్వారానే బాధితులకు అవసరమైన మందులు అందిస్తూ, ఇతర సూచనలను ఇస్తూ వారికి బాసటగా నిలుస్తున్నాయి.

హోం ఐసోలేషన్​ ప్యాకేజీ
హోం ఐసోలేషన్​ ప్యాకేజీ
author img

By

Published : Apr 24, 2021, 8:52 PM IST

Updated : Apr 24, 2021, 9:11 PM IST

కరోనా పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన పని లేదు. లక్షణాలు లేని వారిలో వైరస్ ప్రభావం అంతంత మాత్రమే అని వైద్యులు చెబుతూనే ఉన్నా.. బాధితులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. పాజిటివ్​గా నిర్ధారణ కాగానే ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రస్తుతం పడకలు నిండుకున్న పరిస్థితి ఏర్పడింది.

హోం ఐసోలేషన్ ప్యాకేజీ..

ఈ నేపథ్యంలో అనేక ప్రైవేటు ఆసుపత్రులు హోం ఐసోలేషన్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాయి. లక్షణాలు లేని వారు, స్వల్పంగా లక్షణాలు ఉన్నవారికి అతి తక్కువ ఖర్చుతో చికిత్స అందించేందుకు ముందుకు వచ్చాయి. రోగికి కావాల్సిన అన్ని రకాల మందులు, ఆన్​లైన్ కన్సల్టేషన్​లతో పాటు.. అత్యవసరమైతే తక్షణమే ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఫలితంగా పరిస్థితి చేయి దాటితే పడకలు దొరకవన్న భయం బాధితుల్లో లేకుండా పోయింది. ఇక అవసరాన్ని బట్టి ఈ ప్యాకేజీలో బేసిక్, అడ్వాన్స్​డ్​, స్టాండర్డ్ ప్యాకేజీలు ఉన్నాయి.

రోజుకు రూ.600 నుంచి 2000..

నగరంలోని కేర్, సన్​షైన్, కిమ్స్, ఆస్టర్ ప్రైమ్ వంటి పలు ఆసుపత్రులు ప్రస్తుతం హోం ఐసోలేషన్​ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వైరస్​తో బాధపడుతున్న వారు ఆయా ఆసుపత్రుల వెబ్​సైట్​లో నమోదు చేసుకోవడం లేక నేరుగా ఆసుపత్రికి ఫోన్​ చేసి ఈ ప్యాకేజీలను పొందవచ్చు. ఒక్కో ఆసుపత్రి సుమారుగా రోజుకు రూ.600 నుంచి రూ.2000 వరకు ఫీజులు తీసుకుంటుంది. అంటే 14 రోజుల ప్యాకేజీకి అయ్యే ఖర్చు రూ.10 నుంచి 25 వేల వరకు మాత్రమే ఉంటుంది.

నిరంతరం పర్యవేక్షణ..

ఈ ప్యాకేజీలో భాగంగా నిపుణులైన వైద్యులు రోజుకు రెండుసార్లు బాధితుల ఆరోగ్యాన్ని ఆన్​లైన్ ద్వారా పర్యవేక్షిస్తారు. అవసరమైన మందులు, పల్స్​ ఆక్సిమీటర్, థర్మామీటర్ వంటి కిట్లను ఇంటికే పంపటంతో పాటు వాటి వినియోగాన్ని వివరిస్తారు. కౌన్సెలింగ్​ల ద్వారా కరోనాపై ఆందోళన పడేవారిలో మానస్థిక స్థైర్యాన్ని పెంపొందించటంతో పాటు రోగి ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్న అనుమానం వస్తే వెంటనే ఇంటికే అంబులెన్స్​ పంపి ఆసుపత్రికి తరలిస్తారు. ఫలితంగా ఎలాంటి సమయంలోనైనా అవసరమైన వైద్య సహాయం అందించే సౌకర్యం ఏర్పడుతోంది. ఈ ప్యాకేజీ కొవిడ్​ బాధితులకు ఎంతో ఉపశమనం కలిగిస్తోంది.

ఇదీ చూడండి: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌: సీఎం కేసీఆర్‌

కరోనా పాజిటివ్ వచ్చినా భయపడాల్సిన పని లేదు. లక్షణాలు లేని వారిలో వైరస్ ప్రభావం అంతంత మాత్రమే అని వైద్యులు చెబుతూనే ఉన్నా.. బాధితులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. పాజిటివ్​గా నిర్ధారణ కాగానే ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రస్తుతం పడకలు నిండుకున్న పరిస్థితి ఏర్పడింది.

హోం ఐసోలేషన్ ప్యాకేజీ..

ఈ నేపథ్యంలో అనేక ప్రైవేటు ఆసుపత్రులు హోం ఐసోలేషన్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాయి. లక్షణాలు లేని వారు, స్వల్పంగా లక్షణాలు ఉన్నవారికి అతి తక్కువ ఖర్చుతో చికిత్స అందించేందుకు ముందుకు వచ్చాయి. రోగికి కావాల్సిన అన్ని రకాల మందులు, ఆన్​లైన్ కన్సల్టేషన్​లతో పాటు.. అత్యవసరమైతే తక్షణమే ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఫలితంగా పరిస్థితి చేయి దాటితే పడకలు దొరకవన్న భయం బాధితుల్లో లేకుండా పోయింది. ఇక అవసరాన్ని బట్టి ఈ ప్యాకేజీలో బేసిక్, అడ్వాన్స్​డ్​, స్టాండర్డ్ ప్యాకేజీలు ఉన్నాయి.

రోజుకు రూ.600 నుంచి 2000..

నగరంలోని కేర్, సన్​షైన్, కిమ్స్, ఆస్టర్ ప్రైమ్ వంటి పలు ఆసుపత్రులు ప్రస్తుతం హోం ఐసోలేషన్​ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వైరస్​తో బాధపడుతున్న వారు ఆయా ఆసుపత్రుల వెబ్​సైట్​లో నమోదు చేసుకోవడం లేక నేరుగా ఆసుపత్రికి ఫోన్​ చేసి ఈ ప్యాకేజీలను పొందవచ్చు. ఒక్కో ఆసుపత్రి సుమారుగా రోజుకు రూ.600 నుంచి రూ.2000 వరకు ఫీజులు తీసుకుంటుంది. అంటే 14 రోజుల ప్యాకేజీకి అయ్యే ఖర్చు రూ.10 నుంచి 25 వేల వరకు మాత్రమే ఉంటుంది.

నిరంతరం పర్యవేక్షణ..

ఈ ప్యాకేజీలో భాగంగా నిపుణులైన వైద్యులు రోజుకు రెండుసార్లు బాధితుల ఆరోగ్యాన్ని ఆన్​లైన్ ద్వారా పర్యవేక్షిస్తారు. అవసరమైన మందులు, పల్స్​ ఆక్సిమీటర్, థర్మామీటర్ వంటి కిట్లను ఇంటికే పంపటంతో పాటు వాటి వినియోగాన్ని వివరిస్తారు. కౌన్సెలింగ్​ల ద్వారా కరోనాపై ఆందోళన పడేవారిలో మానస్థిక స్థైర్యాన్ని పెంపొందించటంతో పాటు రోగి ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్న అనుమానం వస్తే వెంటనే ఇంటికే అంబులెన్స్​ పంపి ఆసుపత్రికి తరలిస్తారు. ఫలితంగా ఎలాంటి సమయంలోనైనా అవసరమైన వైద్య సహాయం అందించే సౌకర్యం ఏర్పడుతోంది. ఈ ప్యాకేజీ కొవిడ్​ బాధితులకు ఎంతో ఉపశమనం కలిగిస్తోంది.

ఇదీ చూడండి: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌: సీఎం కేసీఆర్‌

Last Updated : Apr 24, 2021, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.