ETV Bharat / state

కరోనా బారిన పడకుండా పోలీస్​ శాఖ ప్రత్యేక చర్యలు

కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న తరుణంలో పోలీస్ శాఖ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కరోనా బారిన పడకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఇప్పటికే సూచనలు చేసిన ఉన్నతాధికారులు... పోలీసులు ఉపయోగించే వాహనాలను సైతం శానిటైజేషన్​ చేసేలా చర్యలు చేపడుతున్నారు.

author img

By

Published : Jul 9, 2020, 4:48 AM IST

Police Department special measures to prevent corona infection
కరోనా బారిన పడకుండా పోలీస్​ శాఖ ప్రత్యేక చర్యలు
కరోనా బారిన పడకుండా పోలీస్​ శాఖ ప్రత్యేక చర్యలు

రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో నమోదవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో కూడా కొంతమంది వైరస్ బారిన పడుతున్నారు. వాహనాల తనిఖీ, కరోనా రోగుల తరలింపు, శాంతిభద్రతల విధులు ఇలా క్షణం తీరిక లేకుండా ఉండే పోలీసులు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వారిలో కొంతమందికి మహమ్మారి సోకుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 400 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.

150 మందికి...

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సుమారు 150 మందికి కరోనా సోకింది. ఉన్నతాధికారులు... సిబ్బంది విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిబ్బందికి ఆరోగ్య నియమాలు వివరించి... తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నారు. వైరస్ సోకే అవకాశం ఉన్న ప్రతి చోటును శానిటైజేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఉపయోగించే ద్విచక్ర వాహనాల్ని, ఇతర వాహనాల్ని శానిటైజ్ చేయిస్తున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు..

విధి నిర్వహణలో పోలీసులు వివిధ ప్రాంతాల్లో సంచరించాల్సి ఉంటుంది. దర్యాప్తులో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇతర వ్యక్తులను పోలీసులు తమ వాహనాల్లో తీసుకుని వెళుతుంటారు. ఒకవేళ పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తికి కరోనా ఉంటే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గస్తీ వాహనాలను ప్రత్యేక రసాయనాలతో శానిటైజేషన్​ చేయడం వల్ల వైరస్ తొలగిపోయే అవకాశం ఉంటుంది. మూడు కమిషనరేట్లలోనూ... పోలీసు వాహనాలను శానిటైజేషన్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మూడు వారాలకు ఒకసారి..

అంబర్‌పేట్‌ పోలీసు మైదానంలో హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన వాహనాలను శుభ్రపరుస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ ప్రాంగణంలోనూ... ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వాహనాలు కలిపి దాదాపు 3 వేల వరకు ఉంటాయి. ఒక్క వాహనాన్ని మూడు వారాలకు ఒకసారి శానిటైజేషన్ చేయడానికి క్రాఫ్ట్ అనే సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. వాహనాలను శానిటైజేషన్‌ చేయడం పట్ల గస్తీ పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మనోధైర్యం..

క్షేత్రస్థాయి పోలీసులకు పలు సౌకర్యాలు కల్పిస్తూ... వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు ఉన్నతాధికారులు. కరోనా వైరస్ నిర్మూలనలో తమ వంతు పాత్ర పోషిస్తున్న పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.

ఇవీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1924 మందికి కరోనా పాజిటివ్

కరోనా బారిన పడకుండా పోలీస్​ శాఖ ప్రత్యేక చర్యలు

రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో నమోదవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో కూడా కొంతమంది వైరస్ బారిన పడుతున్నారు. వాహనాల తనిఖీ, కరోనా రోగుల తరలింపు, శాంతిభద్రతల విధులు ఇలా క్షణం తీరిక లేకుండా ఉండే పోలీసులు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వారిలో కొంతమందికి మహమ్మారి సోకుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 400 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.

150 మందికి...

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సుమారు 150 మందికి కరోనా సోకింది. ఉన్నతాధికారులు... సిబ్బంది విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిబ్బందికి ఆరోగ్య నియమాలు వివరించి... తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నారు. వైరస్ సోకే అవకాశం ఉన్న ప్రతి చోటును శానిటైజేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఉపయోగించే ద్విచక్ర వాహనాల్ని, ఇతర వాహనాల్ని శానిటైజ్ చేయిస్తున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు..

విధి నిర్వహణలో పోలీసులు వివిధ ప్రాంతాల్లో సంచరించాల్సి ఉంటుంది. దర్యాప్తులో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇతర వ్యక్తులను పోలీసులు తమ వాహనాల్లో తీసుకుని వెళుతుంటారు. ఒకవేళ పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తికి కరోనా ఉంటే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గస్తీ వాహనాలను ప్రత్యేక రసాయనాలతో శానిటైజేషన్​ చేయడం వల్ల వైరస్ తొలగిపోయే అవకాశం ఉంటుంది. మూడు కమిషనరేట్లలోనూ... పోలీసు వాహనాలను శానిటైజేషన్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మూడు వారాలకు ఒకసారి..

అంబర్‌పేట్‌ పోలీసు మైదానంలో హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన వాహనాలను శుభ్రపరుస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ ప్రాంగణంలోనూ... ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వాహనాలు కలిపి దాదాపు 3 వేల వరకు ఉంటాయి. ఒక్క వాహనాన్ని మూడు వారాలకు ఒకసారి శానిటైజేషన్ చేయడానికి క్రాఫ్ట్ అనే సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. వాహనాలను శానిటైజేషన్‌ చేయడం పట్ల గస్తీ పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మనోధైర్యం..

క్షేత్రస్థాయి పోలీసులకు పలు సౌకర్యాలు కల్పిస్తూ... వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు ఉన్నతాధికారులు. కరోనా వైరస్ నిర్మూలనలో తమ వంతు పాత్ర పోషిస్తున్న పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.

ఇవీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1924 మందికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.